అక్కినేని సమంత, శర్వానంద్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'జాను' . తమిళ సూపర్ హిట్ సినిమా 96 కి  అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కించారు. ఇక ఫిబ్రవరి 7న ఈ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తమిళ్‌లో విజయ్ సేతుపతి, శ్రిష హీరోహీరోయిన్లుగా నటించగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు త్రిషకి మంచి కం బ్యాక్ మూవీ అని చెప్పాలి. ఇక తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో హీరోయిన్స్ సమంత శర్వానంద్ తో పాటు టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వంశీ పైడిపల్లి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా సమంత తన సక్సెస్ సీక్రెట్ ని రివీల్ చేశారు. 'నేను ప్రతి సినిమాకు మిమ్మల్ని డిజప్పాయింట్ చేయకూడదని భయపడుతూనే ఉంటాను. ప్రతి సినిమాను నేను నా మొదటి సినిమాగానే భావిస్తా. షూటింగ్‌కి వెళ్లినప్పుడు నేను నా మొదటి సినిమా చేస్తున్నట్టుగానే అనుకుంటాను. తమిళ్ కల్ట్ క్లాసిక్ మూవీ '96'ను తెలుగులో 'జాను' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అనుకుంటున్నా. కాని ఫిబ్రవరి 7 తరువాత ఖచ్చితంగా మాట్లాడతా. ఎందుకంటే ప్రతిరోజు నేను ప్యాకప్ చెప్పిన తరువాత మ్యాజిక్ జరిగినట్టే భావించా. ఆ మ్యాజిక్ ఏంటన్నది ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో మీరే చూస్తారు... అంటూ సినిమా మీద అంచనాలు పెంచేలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సమంత.

 

సినిమా చేయాలని దిల్ రాజు మొదట్లో చెప్పినప్పుడు పారిపోయా.. కాని ఆయన రెండోసారి అడిగినన్ను ఒప్పించారు. అందువల్లే నేను ఇంత మంచి సినిమా చేయగలిగాను. ఈ సినిమాలో నా రోల్ బాగా వచ్చింది అంటే అది హీరో శర్వానంద్ వల్లే. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.. అంటూ సినిమా మీద ధీమాను వ్యక్తం చేశారు సమంత.  మరి ఇంకో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న జాను ప్రేక్షలులను సమంత ఫ్యాన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి. ఎందుకంటే బజ్ కూడా ఈ సినిమా మీద అంతంత మాత్రమగానే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: