చలో సినిమాతో వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్న హీరో నాగశౌర్య.. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం ‘అశ్వధ్ధామ’ మంచి అంచనాల నడుమ జనవరి 31న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది.. మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజు మంచి వసూళ్లను సాధించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమాతో యంగ్ హీరో నాగశౌర్య భారీ విజయం అందుకోవాలని ఆశించాడు..

 

అంతకముందు తీసిన సినిమాలు మంచి విజయాల్ని ఇచ్చినా గాని అనుకున్నంత పేరు సంపాదించిపెట్టలేదు... ఈ సినిమా తో మంచి హిట్ కొట్టాలనుకున్నాడు..

ఈ క్రమంలో సినిమాను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ మొదలుపెట్టారు.ఈ సినిమాను తాజాగా స్టార్ బ్యూటీ సమంతతో ప్రమోట్ చేయించారు..సమంత మరియు నాగ సౌర్య కాంబినేషన్ లో అంతకముందు ఓహ్ బేబీ అనే మూవీ వచ్చింది.. సినిమా కూడా మంచి టాక్ సంపాదించింది. అందుకే సమంత సినిమా ప్రమోషన్ చేయడానికి ఒప్పుకుంది. 

సమంత కూడా ఓకే చెప్పి ప్రమోషన్ మొదలుపెట్టింది.. అశ్వధ్ధామ సినిమా బాగుందని, ప్రతిఒక్కరు చూడాల్సిందిగా సమంత తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ట్విట్టర్ ద్వారా  కోరింది.సమంత అడగడం అభిమానులు చూడకపోవడమా !!!ఈ ట్వీట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. .

కాగా నాగసౌర్య ఈ సినిమాకు అందించిన కథను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.రమణ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు గిబ్రన్ అందించిన బీజీఎం బాగా రావడంతో సినిమాను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు జిష్షు సేన్‌గుప్తా.మెహ్రీన్ పీర్జాదా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మున్ముందు ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.నాగ సౌర్య కెరీర్ లో మంచి హిట్టుగా నిలవాలని కోరుకుందాం...

మరింత సమాచారం తెలుసుకోండి: