వివాదాస్ప‌ద చిత్రాల‌ను తెర‌కెక్కిచ‌డంలో రామ్‌గోపాల్‌వ‌ర్మ దిట్ట అని చెప్పాలి. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక కొత్త వివాదంతో తెర‌పైకి వ‌స్తూ ఉంటారు ఆయ‌న. ఇక నిన్నే త‌న కొత్త చిత్రం అనౌన్స్‌మెంట్ జ‌రిగింది. ఈ చిత్రం వ‌చ్చేసి రియ‌ల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఓ క్రైమ్ స్టోరీ అంటే ఇటీవలె శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ స‌మీసంలో జ‌రిగిన దిశ హ‌త్య కేసు పై సినిమా తీస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఇక‌పోతే ఇలాంటి వివాదాస్ప‌ద ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా తీసుకుని సినిమాలు చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటే. 

 

ఇక ఈ దిశ ఉదంతాన్ని ఎవ‌రో ఒక‌రు ఖ‌చ్చితంగా సినిమా తీస్తార‌న్న ప్ర‌చార‌మ‌యితే జ‌రిగింది కానీ వ‌ర్మ తాజాగా త‌న త‌ర్వాత ప్రాజెక్ట్ ఇదే అంటూ ప్ర‌క‌టించ‌డం అంద‌ర్నీ ఆశ్చర్యం క‌లిగించింది.  అంతేకాదు ఈ సినిమా ద్వారా చాలా భయంకరమైన నిజాలు చెప్పబోతున్నానని, రేప్ చేయాలనుకునే వాళ్ళు భయంతో వణికిపోయేలా తన సినిమాలో సన్నివేశాలు ఉండబోతున్నాయని అన్నారు. ఇదే క‌నుక జ‌రిగితే ఒక‌ర‌కంగా చెప్పాలంటే వ‌ర్మ ఈ సినిమా ద్వారా ఒక మంచి చేస్తున్న‌ట్లే. ఎందుకంటే దేశంలో ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా కూడా ఆడ‌పిల్ల‌ల్ని ఏకంగా చంప‌డానికే ఒడిగ‌డుతున్న ఈ ఆక‌తాయిల ఆగ‌డాలు కాస్త‌యినా ఆగుతాయి అని కొంద‌రు భావిస్తున్నారు. 

 

 లాయర్ ఏపీ సింగ్ లాంటి వాళ్లు న్యాయశాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని ఆడుకుంటున్నారని, నిర్భయ దోషుల తరఫున ఏపీ సింగ్ వాదిస్తూ వారికి ఉరిశిక్ష పడకుండా వాయిదాలు పడేలా చేస్తున్నాడని ఇలాంటి వాళ్ళే తన సినిమాలో మెయిన్ విలన్స్ అని వర్మ చెప్పుకొస్తూ ట్వీట్ చేశాడు. ఇలాంటి సినిమా తెర‌కెక్కించ‌డం వ‌ల్ల వ‌ర్మకు లేడీ ఫ్యాన్స్ పెరిగే అవ‌కాశం ఎంతైనా ఉంది. అది ఓ త‌ల్లి గుండె ఆవేద‌న‌ను అర్ధం చేసుకున్న వాడ‌వుతాడు అని మ‌రి కొంద‌రు భావిస్తున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ వాస్త‌వాల‌ను ఉన్న‌ది ఉన్న‌ట్టు తెర‌కెక్కిస్తే సినిమా బావుంటుంది. అయినా వివాదాలు చూపించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి మ‌రెవ్వ‌రూ లేరు అని చెప్ప‌వ‌చ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: