అవునట.. దర్శకుడు విజయ్, అమలాపాల్‌ విడిపోవడానికి నటుడు ధనుషే కారణం అట. వినడానికి విడ్డురంగా వున్నా, అదే నిజమని కోలీవుడ్ వర్గాలు గుస గుసలాడుతున్నాయి. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో పాపులర్‌ అయిన మలయాళ కుట్టి అమలాపాల్‌. ఆ తరువాత వరుసగా ఆమెకు అవకాశాలు రావడం మొదటెట్టాయి అలాంటి సమయంలో దర్శకుడు విజయ్‌తో పరిచయమైంది. ఆయన విక్రమ్‌ హీరోగా తెరకెక్కించిన దైవ తిరుమగళ్‌ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా అమలాపాల్‌ను ఎంపిక చేశారు. ఆ తరువాత నటుడు విజయ్‌ హీరోగా చేసిన తలైవా చిత్రంలోనూ అమలాపాల్‌నే హీరోయిన్‌గా నటించింది. 

 

అలా దర్శకుడు విజయ్, నటి అమలాపాల్‌ల మధ్య పరిచయం, స్నేహం కాస్త ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది. అలా 2014లో దర్శకుడు విజయ్, అమలాపాల్‌ల పెళ్లి పెద్దల సమ్మతంతో జరిగింది. అయితే పెళ్లి అయిన రెండేళ్లకే ఈ జంట విడిపోయారు. అయితే అప్పుట్లో ఇద్దరం పరస్పర చర్చలతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు కానీ, సమస్య ఏమిటన్నది ఎవరూ చెప్పలేదు. అయితే పెళ్లి అయిన తరువాత నటి అమలాపాల్‌ మళ్లీ సినిమాల్లో నటించడం మొదలెట్టింది.

 

ఆమె నటించడం దర్శకుడు విజయ్‌కు ఇష్టం లేదని, ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని ప్రచారం జరిగింది. ఇదంతా జరిగి మూడేళ్లపైనే అయ్యింది. దర్శకుడు విజయ్‌ గత ఏడాది ఐశ్వర్య అనే వైద్యురాలిని రెండో పెళ్లి చేసుకున్నారు. నటి అమలాపాల్‌ నటిగా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు విజయ్, నటి అమలాపాల్‌ విడిపోవడానికి అసలు కారణాన్ని విజయ్‌ తండ్రి ఏఎల్‌.అళగప్పన్‌ మీడియాకు చెప్పుకొచ్చారు. 

 

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వివాహానంతరం అమలాపాల్‌ నటించరాదని నిర్ణయించుకుందన్నారు. అలాంటిది నటుడు ధనుష్‌నే ఆమెను తను నిర్మించిన అమ్మా కణక్కు చిత్రంలో నటించేలా చేశారని చెప్పారు. ఆ చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయిన తరువాతనే విజయ్‌కు, అమలాపాల్‌కు మధ్య సమస్యలు తలెత్తడం ప్రారంభించాయని ఏఎల్‌.అళగప్పన్‌ ఆరోపణలు చేశారు. ఇది ఇప్పుడు సినీపరిశ్రమలో కలకలానికి దారి తీసింది. అసలే సినిమా జనం.. ఇంత అంటే, అంట చేసేస్తుంది మీడియా... ఏమోమరి లోగుట్టు పెరుమాళ్ళకెరుక!!

మరింత సమాచారం తెలుసుకోండి: