కన్నడ భామ రష్మిక మందన్న కన్నడ భాషలో కిరిక్ పార్టీ అనే సినిమాతో అక్కడ హీరోయిన్ గా అడుగుపెట్టి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆమె నటనను మెచ్చిన తెలుగు యువ దర్శకుడు వెంకీ కుడుముల, తాను తీయబోయే తొలి వెంచర్ ఛలో లో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. నాగశౌర్య హీరోగా తెరకెక్కన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించిన గీత గోవిందం సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడంతో టాలీవుడ్ దర్శకుల చూపు రష్మిక పై పడింది. ఇక ఆ తరువాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు లో ఛాన్స్ కొట్టిన రష్మిక

 

ఇటీవల సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఆ సినిమా పెద్ద సక్సెస్ అందుకోవడంతో మరింత బాగా క్రేజ్ దక్కించుకుంది. ఇక ప్రస్తుతం నితిన్ సరసన భీష్మతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ ల కలయికలో తెరకెక్కుతున్న సినిమాలు దక్కించుకున్న రష్మిక ఇంటిపై ఇటీవల ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడుల్లో కొంత డబ్బుతో పాటు పలు కీలక పత్రాలు కూడా ఆమె ఇంటి నుండి ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నితిన్ తో ఆమె నటిస్తున్న భీష్మకు దర్శకుడైన వెంకీ కుడుములను ఉద్దేశించిన ఒక పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మ్యాటర్ ఏంటంటే, 

 

భీష్మ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఉండగా ఈ సినిమాలో నిన్నే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే నువ్వు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు రష్మిక అంటూ మొన్న డైరెక్టర్ వెంకీ కుడుముల ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు. అయితే ఆ పోస్ట్ ని రీట్వీట్ చేసిన రష్మిక, మీకు కూడా థ్యాంక్స్, ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ మెంబెర్ వంటి వారు అని చెప్తూ పోస్ట్ చేసింది. అయితే ఆమె పోస్ట్ ని రీట్వీట్ చేసిన దర్శకుడు వెంకీ, దయచేసి నేను మీ ఫ్యామిలి మెంబెర్ ని అని చెప్పకు తల్లో, దాని వల్ల నాపై కూడా ఇన్కమ్ టాక్స్ దాడులు జరుగుతాయి అంటూ ఫన్నీ గా రిప్లై ఇవ్వడం జరిగింది. కాగా రష్మిక ను ఉద్దేశించి, దర్శకుడు వెంకీ చేసిన ట్వీట్ పై పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: