పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. సుదీర్ఘ లక్ష్యం కోసం రాజకీయ పార్టీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు పవన్ కళ్యాణ్. పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తాడని వార్తలు వస్తున్నప్పటి నుండి ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ దర్శకుడితో సినిమా ఉంటుందని, ఈ దర్శకుడితో సినిమా ఉంటుందని రోజుకో వార్త ప్రచారంలోకి వచ్చింది.

 

 

ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ పవన్ బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఎమ్ సీ ఏ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే పవన్ ఈ ఒక్క సినిమాతోనే ఆగిపోవట్లేదు. ఈ ఏడాది వరుసగా నాలుగు చిత్రాల్లో కనిపించనున్నాడు. ఆ నాలుగు చిత్రాలలో ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉండనుంది. ఇది వరకు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన గబ్బర్ సింగ్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 

 

 

అప్పటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కెరీర్ గబ్బర్ సింగ్ సినిమాతో టాప్ గేర్ లోకి వెళ్ళిపోయింది. అప్పట్లో ఆ సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ అని తెలియగానే అభిమానులందరిలో ఉత్సాహం ఉప్పెనలా ఉప్పొంగింది. అసలు పవన్  కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా ఇదే అయ్యుంటే బాగుండేదని అంటున్నారు. 

 

 

స్వతాహాగా పవన్ అభిమాని అయిన హరీష్ శంకర్, అభిమానిగా తాను పవన్ ని ఎలా చూడాలనుకుంటున్నాడో అలా చూపిస్తాడు. గబ్బర్ సింగ్ లో అందరూ అదే చూశారు. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా రీ ఎంట్రీ సినిమా ఇదే అయ్యుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: