మెగా ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాగ్రౌండ్తో సంబంధం లేకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తెలుగు తెరకు పరిచయమైన పవన్ ఆ తర్వాత.. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి మరియు ఇప్పటికీ అందరి ఫేవరెట్ ఖుషి సినిమాతో వరుసగా ఆరు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఖుషి సినిమా పవన్ కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచిపోయింది.
వాస్తవానికి చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా, తన మేనరిజంతో, నటనతో యువతని తన వైపుకు తిప్పుకుని తనకంటూ సొంత అభిమాన గణాన్ని ఏర్పర్చుకోగలిగాడు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవిని సైతం బీట్ చేసేలా ఆయన క్రేజ్ ఉంది. ఈయనకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరో హీరోకి ఉండదని చెప్పడం అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా హీరోల్లో పవన్ కళ్యాణ్ ఓ డిఫరెంట్ స్టైల్. ఆయన ఏది చేసినా ఓ సంచలనమే. గుడుంబా శంకర్, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, కాటమరాయుడు ఇలా అన్ని సినిమాల్లో ఒన్ మ్యాన్ షోతో అదరగొట్టేస్తారు.
క్లారిటీగా చెప్పాలంటే పవన్ కళ్యాన్ చేసే సినిమా హిట్ అయినా ప్లాన్ అయినా బాక్సాఫిస్ వద్ద మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తాయి. కాగా, చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్ డమ్ తో కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. తన ఎస్ అంటే కోట్ల కు కోట్లు పారితోషికాలు ఇచ్చి మరి సినిమాలు తీయగలిగే నిర్మాతలు ఉన్నప్పటికీ ఈయన మాత్రం ప్రజాసేవ వైపు అడుగులు వేశారు. అయితే గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ స్టార్ హీరో మరోసారి సినిమాల్లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 'పింక్' రీమేక్ షూటింగ్లో పాల్గొంటూనే క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేసేశాడు. దీంతో అభిమానుల్లో సందడి మొదలైంది.