టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్లో అడుగుపెట్టినా.. బ్యాగ్రౌండ్తో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ సినిమా వేడులకలోనే కాదు ఇతర హీరోల సినిమా వేడుకల్లోనూ పవర్ స్టార్ అన్న నినాదాలు వినిపిస్తుంటాయి. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ సినిమాతో టాలీవుడ్కు మీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్. అయితే ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు.
అయితే ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి మరియు యూత్ ఫేవరెట్ ఖుషి సినిమాతో వరుసగా ఆరు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ ని తెచ్చి పెట్టింది. తన మేనరిజంతో, నటనతో యువతని తన వైపుకు తిప్పుకుని తనకంటూ సొంత అభిమాన గణాన్ని ఏర్పర్చుకోగలిగాడు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవిని సైతం బీట్ చేసేలా ఆయన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘ఖుషి’ పవన్ కళ్యాన్ రేంజ్ ఎక్కడికో తీసుకు వెళ్లింది. టాలీవుడ్ లో ఖుషి తరువాత అనేక ప్రేమ కథలు, రొమాంటిక్ చిత్రాలు వచ్చి ఉండవచ్చు కానీ, ఖుషి చిత్ర స్థానం మాత్రం ఎప్పుడూ ప్రత్యకంగానే ఉంటుంది.
అందమైన ప్రేమకథగా కుర్రకారును పలకరించిన ఈ సినిమా, ఆ తరువాత వచ్చిన ఎన్నో ప్రేమకథలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది ఇలా సినిమా ఏదైనా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేశాడు పవన్ కళ్యాణ్. కాగా, సినిమాల్లో మాంజి ఫామ్లో ఉండగానే రాజకీయాల వైపు అడుగువేశారు. అయితే మళ్లీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రి ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ను పవన్ ప్రధాన పాత్రలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీంతో పాటే మరిన్ని చిత్రాలకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు పవన్.