టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కొన్నేళ్ల క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకుని అటు పవన్, త్రివిక్రమ్ లతో పాటు హీరోయిన్ గా సమంత కు కూడా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. అనంతరం కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు, గోపాల గోపాల, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాల్లో నటించిన పవన్, వాటితో వరుసగా పరాజయాలు చవిచూశారు. 

 

ఇక ఆ తరువాత నుండి రెండు సంవత్సరాల పాటు రాజకీయాల్లో తన జనసేన పార్టీ తరపున బిజీ అయిన పవన్ కళ్యాణ్, మళ్ళి ప్రస్తుతం ముఖానికి మేకప్ వేసుకుని బాలీవుడ్ మూవీ పింక్ అధికారిక తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మే లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే దీనితో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ ఒక సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఇవాళ్టి నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా ఒక పీరియాడికల్ డ్రామాగా పాన్ ఇండియా అపీల్ తో తెరకెక్కుతున్నట్లు టాక్. 

 

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇటీవల కొందరి పేర్లు ప్రచారం అవ్వగా, ఎట్టకేలకు నేడు ఈ సినిమాలో హీరోయిన్ గా అక్కినేని సమంతను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై నిన్న ఉదయం సమంతను కలిసిన దర్శకుడు క్రిష్, ఆమెకు కథ చెప్పడం, అలానే సమంతకు కథ ఎంతో బాగా నచ్చడంతో ఆమె కూడా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయినట్లయితే మరొక్కసారి వెండితెరపై పవన్, సమంతల జోడీని చూడవచ్చన్నమాట. కాగా ఈ సినిమా రాబోయే సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు సమాచారం....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: