తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్. ఇప్పటి వరకు ఈయన చేసిన షోస్ అన్నీ దాదాపు సూపర్ హిట్ అయ్యాయి. అయితే బుల్లితెర స్టార్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్ కొద్దిరోజులుగా టీవీ షోల్లో కనిపించడం లేదు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు ప్రదీప్. ఇందులో ప్రదీప్ లవ్ గురుగా నటిస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.
అయితే ఈ క్రమంలోనే ప్రదీప్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్శకుడు శ్రీరామోజు సునిశిత్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ లో ఒకే సామజిక వర్గానికి చెందిన హీరోలు పెత్తనం చెలాయిస్తున్నారా..? కొత్త వారిని హీరోలుగా ఆ సామాజిక వర్గం ఎందుకు ఎంకరేజ్ చెయ్యట్లేదు..? అన్న ప్రశ్నలు ప్రస్తుతం తెరపైకి వచ్చాయి.
ప్రదీప్పై కేసు నమోదు చేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రదీప్ హీరోగా చేస్తోన్న ’30రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట ట్రెండ్ అవుతోంది. దీంతో అతడు సినిమా ఎంట్రీ చాలా గ్రాండ్ గా జరిగేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ప్రదీప్ ఎదుగుదలపై కన్నేసిన కొన్ని శక్తులు ఇండస్ట్రీలో కొత్త వారికి చాన్సులు ఇస్తే, తర్వాత ఆ రెండు సామాజిక వర్గాల చేతుల నుంచి ఇండస్ట్రీ పట్టు కోల్పుతుందని భావించి, కొత్త సామాజిక వర్గాల నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారిని మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోందని టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఒకే సామజిక వర్గానికి చెందిన వారి పెత్తనం కొనసాగుతోంది. స్టూడియోలు, నిర్మాణ సంస్థలు అన్నీ కూడా ఆ సామాజిక వర్గానివే కావడంతో వారి ఆధిపత్యం కనిపిస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరువాత కృష్ణ, శోభన్ బాబు లాంటి వారు వచ్చారు.. వీరు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో టాలీవుడ్ లో నిలదొక్కుకున్నారు. ఇక తర్వాత వీళ్ల వారసులే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ చిరంజీవి అతని ఫ్యామిలీ మినహా దాదాపు పెద్ద హీరోలందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అయితే ఇప్పుడు ఈ క్రమంలోనే కొందరు ప్రదీప్ను తొక్కేయాలని కుట్రలు జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.