దేశంలో ప్రముఖ క్రీడాకారులు, సినీ, రాజకీయ, సెలబ్రెటీలకు సంబంధించిన మైనం బొమ్మలు   సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయడం చూస్తున్నాం.   ఆ మద్య బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మైనపు బొమ్మ పెట్టిన అరుదైన గౌరవం ఇచ్చారు.  భారత దేశానికి చెందిన ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారి మైనపు బొమ్మలు  సింగపూర్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచారు.  ప్రపంచ ప్రఖ్యాత తారలకు మాత్రమే ఈ గౌరవం దక్కుతుంది.  తాజాగా అందాల కలువ కళ్ల చిన్నది కాజల్ అగర్వాల్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె విగ్రహావిష్కరణ జరుగుతుంది.

 

ఈ నేపథ్యంలో కాజల్ అక్కడికి వెళ్లింది.  రేపు(ఫిబ్రవరి 05) ప్రఖ్యాత సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు.  త‌న విగ్ర‌హాన్ని మేడం టుస్సాడ్స్ లో పెడుతున్నందుకు  సంతోషంగా ఉందని,  దీనికోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానంటూ ఓ వీడియోని ఇన్‌స్ట్రాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది. కాగా ఈ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు చిత్రసీమకు సంబందించి మహేష్ బాబు, ప్రభాస్ వంటి నటుల విగ్రహాలు కోలువుదీరాయి. ఈ విగ్రహాలతో పాటు హిందీ చిత్ర సీమ నుండి అమితాబ్, హృతిక్ రోషన్ , కాజోల్, కరీనా కపూర్ వంటి అనేక మంది నటీ నటుల మైనపు విగ్రహాలు అక్కడ ఉన్నాయి.  

 

ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంలో నటిస్తోంది.  కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2లో కూడా క‌థానాయిక‌గా మెర‌వ‌నుంది.  దక్షిణాదిన హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్ అగర్వాల్. 12 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది.  ఈ మద్య తెలుగు లో ఈ కలువకళ్ల సుందరికి పెద్దగా ఛాన్సులు రావడం లేదు. కవచం, సీత తర్వాత తెలుగు లో కొద్ది గ్యాప్ తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: