యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘అశ్వద్ధామ’. రమణ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ‘ఐరా క్రియేషన్స్’ బ్యానర్ పై ఉషా మూల్పూరి గారు నిర్మించారు. జనవరి 31న విడుదలైన ఈ మూవీ మొదటి షో తోనే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది.  అంతకు ముందు తన సొంత బ్యానర్ లో తీసిన నర్తనశాల దారుణమైన ఫ్లాపు అందుకుంది.  దాంతో ఈసారి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చాడు నాగశౌర్య.ముంబయిలో తన స్నేహితుడి సోదరికి ఎదురైన అనుభవాన్ని కథలా రాసుకున్నానని నాగశౌర్య చెప్పారు. సమాజంలో ఆడవాళ్లపై ఎంతటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. 

 

 బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా విలన్ గా నటించారు. ఆ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండడమే కాకుండా జిషు నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. కొత్త దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన ఈ సినిమాను నాగ శౌర్య సొంతం సంస్థ ఐరా క్రియేషన్స్ నిర్మించింది. మెహ్రీన్ తన అందాలతో బాగానే ఆకట్టుకుంది. అశ్వద్ధామ థియేట్రికల్ హక్కులు 6.5 కోట్లకు అమ్ముడుపోయాయి. రేపటితో ఈ చిత్రం అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కు చేరుకోనుంది.

 

ఈ చిత్రం ద్వారా మరోసారి నాగ శౌర్య భారీ హిట్ ను చేజిక్కించుకున్నాడు. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా డీసెంట్ అమౌంట్ వచ్చింది. మొత్తంగా నాగ శౌర్య కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోనుంది. పెట్టిన బడ్జెట్‌కు సగం లాభం వచ్చిందంటే.. సినిమా ఏ స్థాయిలో ఆడిందో ఊహించవచ్చు. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ సినిమా అని నాగశౌర్య చెబుతూ వచ్చారు. ఏ సినిమాకు కూడా ఇంతటి ఓపెనింగ్స్ ఎప్పుడూ రాలేదని అన్నారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురం లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాల ధాటికి తట్టుకొని కలెక్షన్లు రాబడుతుందంటే.. నాట్ బ్యాడ్ నాగశౌర్య అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: