తెలుగు బుల్లితెరపై వస్తున్న కామెడీ షోల్లో ఎంతో పాపులారిటీ సంపాదించింది జబర్ధస్త్ కామెడీ షో. ఏడేళ్ల క్రితం ప్రారంభంమైన జబర్ధస్త్ ఇప్పటి వరకు ఎంతో ఆదరణతో నడుస్తుంది. జబర్ధస్త్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో అందరినీ అలరిస్తున్న జబర్ధస్త్ ఇప్పుడు సరికొత్త మార్పులతో వస్తుంది. గత ఏడేళ్లుగా ఇందులో జడ్జీగా కొనసాగిన మెగాబ్రదర్ నాగబాబు ఇప్పుడు జీ తెలుగు అదిరింది కామెడీ షోకి వెళ్లిపోయారు. ఆయన స్థానంలో సింగర్, నటుడు మను జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఇక ఏడేళ్లుగా ఎమ్మెల్యే, నటి రోజా జడ్జీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జబర్ధస్త్ తో ఎంతో మంది నటులు వెండి తెరపై తమ సత్తా చాటుతూ వస్తున్నారు. రీసెంట్ గా సుడిగాలి సుధీర్ ‘ సాఫ్టెవేర్ సుధీర్ ’ మూవీతో హీరోగా నటించారు.
ఇక జబర్ధస్త్ లో సుడిగాలి సుధీర్ టీమ్ కి ఎంతో పాపులారిటీ ఉంది. ఇందులో సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, సన్నీ మంచి పంచ్ లతో కడుపుబ్బా నవ్విస్తున్నారు.ఈ నేపథ్యంలో 'త్రీ మంకీస్' సినిమాలో ముగ్గురు కథానాయకులలో ఒకరుగా ఆయన చేశాడు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్లలో గెటప్ శ్రీను ఒకరు. ఒక వైపున 'జబర్దస్త్' చేస్తూనే మరో వైపున సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ వెళుతున్నాడు.
ఆ మద్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో గెటప్ శ్రీను స్నేహితుడిపాత్రలో అదరగొట్టాడు. తాజాగా గెటప్ శ్రీను మాట్లాడుతూ.. నా స్నేహితులైన సుధీర్ , రామ్ ప్రసాద్ తో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. అయితే ఈ మూవీలో నేను ఎలాంటి గెటప్ లోను కనిపించను .. నేను నాలానే వుంటాను. సినిమాల్లో అవసరమైతే తప్ప గెటప్పులలో కనిపించాలని అనుకోవడంలేదు. ఎందుకంటే 'జబర్దస్త్' వేరు .. సినిమా వేరు. అందుకే సినిమాలకు అనుగుణంగా నటిస్తున్నాని అన్నారు.