టాలీవుడ్ లో మాస్ మహరాజ గా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ కు ఈ మద్య ఏ మూవీ కలిసి రావడం లేదు. ఇడియట్ మూవీతో హీరోగా తనదైన మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న రవితేజ తర్వాత విక్రమార్కుడు, దుబాయ్ శీను, బలుపు, పవర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించారు. కిక్ 2, బెంగాల్ టైగర్ సినిమాల తో భారీ డిజాస్టర్ అందుకున్న రవితేజ రెండేళ్ల గ్యాప్ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ తో మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత వరుసగా నాలుగు సినిమాలతో డిజాస్టర్ కావడంతో కెరీర్ కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో ఆయన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంటే బాగుంటుందని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.
ప్రస్తుతం రవితేజ గతంలో తనకు బలుపు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన గోపీచంద్ మలినేని తో ‘క్రాక్’ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో బలుపు హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. పోలీస్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతోనే ఆయన 'క్రాక్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత రవితేజ, రమేశ్ వర్మతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఇటీవల రమేశ్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రాక్షసుడు' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీతో బెల్లంకొండ శ్రీనివాస్ మంచి హిట్ అందుకున్నాడు.
రాక్షసుడు సినిమాతోనూ హిట్టే కొట్టాలనే ఉద్దేశంతో రమేశ్ వర్మ వున్నాడు. ఈయనతో రవితేజకి మంచి సాన్నిహిత్యం వుంది కూడా. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'వీర' సినిమా చేశారు. కానీ ఈ మూవీ పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానిని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ విషయం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తే కానీ అసలు విషయం తెలియదు.