టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌. త‌న అందం అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటుంది. ప్ర‌స్తుతం టాప్ లీడ్‌లో ఉన్న ఈ భామ‌కి అత్త‌వారింటి నుంచి స‌మ‌స్య వ‌చ్చిందంట‌. అంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి కొన్ని ఇబ్బందులను ఈ భామ ఎదుర్కొంటుందట‌. అవేంటంటే ఇటీవ‌లె విడుద‌లైన జాను సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విధంగా తెలిపింది. నాకు పెళ్లైంది.. నా ఫ్యామిలీ గురించి కూడా చూసుకోవాలి కదా.. హీరోయిన్ల కెరీర్ చాలా చిన్నది అన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే నా కెరీర్ ఇంకా రెండు మూడేళ్ల కన్నా ఎక్కువ సాగదు అని చెప్పింది. నేను అమ్మని కావాలి.. అందుకే యాక్టింగ్ తో పాటు అన్నింటికి బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్టింగ్ కి బ్రేకిచ్చాక నా పాపే నా ప్రపంచం అని ఓపెన్ గా చెప్పేసింది.

 

ప్ర‌స్తుతం ఈమె టాప్ లీడ్‌లో ఉంది. పెళ్ళ‌య్యాక ఈ భామ చాలా మంచి మంచి పాత్ర‌ల్లో న‌టిస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంటుంది. తాను న‌టించే ప్ర‌తి చిత్రానికి ఏదో ఒక తేడా చూపిస్తూ వైవిద్య‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రుస్తుంది. ఇక మ‌రో రెండు మూడేళ్ళ‌కు మించి న‌టించ‌నంటున్న స‌మంత మాట‌ల‌కు ఆమె అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఆమెకు ఉన్న డిమాండ్‌తో ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌నిర్మాత‌లంతా ఆమె చుట్టూనే తిరుగుతున్నారు. మ‌రి ఇంత టాప్ లీడ్‌లో ఉన్న ఈ భామ స‌డెన్‌గా ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అక్కినేని ష్యామిలీ పిల్లల కోసం సమంతను చేస్తున్న ఫోర్సేనని ఫిల్మ్ సర్కిల్స్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. 

 

ఇక పెళ్లయ్యి నాలుగైదేళ్లు అయితే ఇక ఇంట్లో వాళ్లు ఎలానూ ఊరుకోరు. పిల్లలు లేకపోతే ఒత్తిడి అంతే ఇదిగా ఉంటుంది. ప్రస్తుతం సామ్ కూడా అలాంటి  పరిస్థితితుల‌నే ఎదుర్కొంటున్న‌ట్లు సమాచారం.  అందుకే సమంత ఈ నిర్ణయం తీసుకుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: