దర్శక ధీరుడు రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవిని ఒత్తిడి చేస్తున్నాడట. మెగా తనయుడు రామ్ చరణ్ సెంటిమెంట్ తో రాజమౌళి, మెగాస్టార్ ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. జక్కన్న ప్లాన్ మిస్ ఫైర్ అవ్వడంతో ఇప్పుడు చిరంజీవి ప్లానింగ్ అడ్జెస్ట్ చేసుకోవాలని కోరుతున్నాడట. 

 

దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ అనూహ్యంగా 2021 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో భారీ వసూళ్లు దండుకోవచ్చని జక్కన్న వేసిన ప్లాన్ బాగానే ఉంది. కానీ రాజౌమౌళి మాస్టర్ ప్లాన్ కు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. దీంతో దర్శక థీరుడు ఇప్పుడు చిరంజీవిని కాకపడుతున్నట్టు తెలుస్తోంది. 

 

రాజమౌళి విడిచిపెట్టిన తేదీని కన్నడ రాకింగ్ స్టార్ యాష్ లాక్ చేశాడు. కేజీఎఫ్ చాప్టర్ 2ని జులై30న రిలీజ్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల ప్రాజెక్టును ఈ సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే రాజమౌళి  ఆగస్ట్ లో కాకుండా 2021లో సమ్మర్ లో రిలీజ్ చేయాలని చిరుపై ఒత్తిడి చేస్తున్నట్టు ఓ క్రేజీ న్యూస్ రన్ అవుతోంది. 

 

ఆర్.ఆర్.ఆర్ రిలీజయ్యే వరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ వేరే సినిమాలో నటించొద్దని రాజమౌళి కండీషన్ పెట్టాడు కానీ తాజా సమాచారం ప్రకారం కొరటాల, చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో చెర్రీ పాత్ర 40నిమిషాలకు పైగా ఉంటుందని టాక్. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ పాత్రపై ఆ ఎఫెక్ట్ పడుతోందని జక్కన్న టెన్షన్ పడుతున్నాడట. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ చిరంజీవి సినిమాను లేట్ గా రిలీజ్ చేయాలని రాజమౌళి ఒత్తిడి చేస్తున్నట్టు వినిపిస్తోంది. మొత్తానికి చిరంజీవిని రాజమౌళి ఆ విషయంలో ఒత్తిడి  చేస్తున్నట్టు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: