ఈ మద్య టాలీవుడ్ లో రిమేక్ సినిమాల జోరు బాగా పెరిగిపోయింది. అయితే రిమేక్ సినిమాలే కాదు ఇతర భాషల్లో మంచి హిట్ సినిమాలు అందించిన దర్శకులు కూడా తెలుగు హీరోలతో సినిమాలు తీసేందుకు సిద్దమవుతున్నారు.  అక్కడ వారి మార్కెట్ బాగా ఉండటంతో తెలుగు హీరోలు సైతం వారితో సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు నటించడానికి సంప్రదింపులు అవుతున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.  ఇక తమిళ నాట ధనుష్ నటించిన ‘అసురన్’ మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి వెట్రి మారన్‌ దర్శకుడు. ఈ మూవీ తెలుగు లో విక్టరీ వెంకటేష్ హీరోగా  ‘నారప్ప’ గా రిమేక్ చేస్తున్నారు.  

 

ఈ మద్యే ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో సర్ ప్రైజ్ చేశారు విక్టరీ వెంకటేష్.  వైవిధ్యభరిత పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విక్టరీ వెంకటేష్ కొంత కాలాంగా రిమేక్ మూవీస్ పై ఎక్కువ దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే.  ఆ మద్య దృశ్యం, గురు లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు.  తాజాగా అసురన్ మూవీ దర్శకులు వెట్రి మారన్‌  తో టాలీవుడ్ టాప్ హీరో జూ.ఎన్టీఆర్ ఓ మూవీకి ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్నాడు.

 

ఆ తరువాత ఆయన త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాతే వెట్రిమారన్ తో చేస్తాడని అంటున్నారు.  సినిమాకి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు.  అయితే మరికొందరు మాత్రం ఎన్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కళ్యాన్ రామ్ తో  ఉండబోతుందని అంటున్నారు.  ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడం కామన్ అయ్యాయి అంటున్నారు నెటిజన్లు.  

మరింత సమాచారం తెలుసుకోండి: