టాలీవుడ్ లోకి నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక మందన. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడి అదృష్టం బాగానే కలిసి వచ్చింది. తర్వాత పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘గీతాగోవిందం’ మూవీలో నటించింది. ఈ మూవీలో ఇద్దరి జోడికి ప్రశంసలు దక్కడమే కాదు.. ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో ఈ మూవీలో నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక కు వరుసగా సినిమా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. ఇదే జోడి తర్వాత ‘డీయర్ కామ్రెడ్’ లో కూడా నటించారు. కానీ ఆశించిన ఫలితం రాలేదు.. కాకపోతే వీరిద్దరి మద్య కెమిస్ట్రీపై ఎన్నో కామెంట్స్ వినిపించాయి.
తెలుగు లో రష్మిక ‘దేవదాస్’ డీయర్ కామ్రెడ్ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సంక్రాంతి పండుగ కానుకగా సరిలేరు నీకెవ్వరు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు సరసన నటించిన ఈ అమ్మడికి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో ఛాన్సు దక్కించుకుంటున్న రష్మికకు మరో అదృష్టం కలిసి వచ్చిందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా పరుశరామ్ మరోసారి ఓ మంచి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన అక్కినేని నాగ చైతన్య హీరోగా కొత్త మూవీ కమిటయ్యారు.
ఈ మూవీ కూడా పరశురామ్ గత సినిమాల తరహాలోనే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఉండనుంది. అయితే పరుశరామ్ తో ఈ కన్నడ బ్యూటీ నటించేందుకు మరోసారి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ మూవీలో చైతన్యకు జోడీగా రష్మిక అయితే బాగుంటుందని ఆమెనే కథానాయకిగా ఎంచుకున్నారట పరశురామ్. మరి ఈ మూవీ కూడా ‘గీతా గోవిందం’ తరహాలో మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. . ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగ చైతన్య చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తికాగానే ఈ మూవీ మొదలుకానుంది.