టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, చిన్న వయసులోనే బలరామాయణం అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేయడం జరిగింది. ఆ సినిమాలో బాల రాముడిగా ఎన్టీఆర్ తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఆ తరువాత పెరిగి పెద్ద అయి, నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, ఆపై రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి హీరోగా అద్భుత విజయాన్ని అందుకున్నాడు. 

 

ఆ తరువాత మరొక రెండు సార్లు రాజమౌళి తో సింహాద్రి, యమదొంగ సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ కు, రాజమౌళి అంటే ఎనలేని అభిమానం. అందుకే ఆయనను ముద్దుగా జక్కన్న అని పిలుస్తుంటారు ఎన్టీఆర్. తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ అంటే రాజమౌళి కి కూడా వల్లమాలిన అభిమానం. దేవుడు ప్రత్యక్షం అయితే ఎన్టీఆర్ అనే నటుడు ఒక్కసారిగా ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుకుంటాను అంటూ రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక వీరిద్దరి మూడవ కాంబినేషన్ లో తెరకెక్కిన యమదొంగ సినిమా విషయమై ఒక వార్త అప్పట్లో పెను సంచలనంగా వైరల్ అయింది. అంతకుముందు వరకు ఎంతో బొద్దుగా ఉండే ఎన్టీఆర్ ని, ఎలాగైనా బరువు తగ్గాలని, అప్పుడే నేను నీతో సినిమా చేస్తాను అని రాజమౌళి కండీషన్ పెట్టారట. నిజానికి అప్పటికే యమదొంగ సబ్జక్ట్ రెడి అయినప్పటికీ, ఎన్టీఆర్ వెయిట్ తగ్గాకే సినిమా మొదలెట్టాలని రాజమౌళి భవించారట. 

 

ఇక ఆ సినిమా కోసం బరువు తగ్గే క్రమంలో ఎన్టీఆర్ పడ్డ బాధలు అన్ని ఇన్ని కావని, కొన్నాళ్ల పాటు కేవలం మంచి నీరు, సాత్వికాహారం మాత్రమే తిని పలు కసరత్తులు చేసిన ఎన్టీఆర్, ఆ నరకం వల్ల అప్పుడప్పుడు ఆ బాధలు తట్టుకోలేక కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారట.  అయితే జక్కన్న తనను బరువు తగ్గమని పెట్టిన నియమం తన మంచి కోసమే కాబట్టి , ఎంత బాధ కలిగినా అది తన మనసులోనే దిగముంగుకునేవాడినని అప్పట్లో ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ అనే భారీ ప్రతిష్టాత్మక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: