టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో మరొక హీరో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి అతి పెద్ద హిస్టాటికల్ మూవీ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ యొక్క నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నప్పుడే బలరామాయణంలో ఆకట్టుకునే నటనను ప్రదర్శించిన ఎన్టీఆర్, హీరోగా మరి నిన్ను చూడాలని అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 

 

ఆపై స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి, యమదొంగ, అదుర్స్, బృందావనం, బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత సినిమాలతో అద్భుత విజయాలు అందుకుని ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక నేటి తరంలో మిగతా నటులతో పోలిస్తే ఎన్టీఆర్ కు మాత్రం ఒక గొప్ప ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. అదేమిటంటే, ప్రస్తుతం ఉన్న నటుల్లో పౌరాణిక పాత్రల్లో నటించి, అత్యద్భుతంగా డైలాగులు పలికించడంలో ఎన్టీఆర్ దిట్ట. ఈ విషయం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమదొంగ సినిమాతో రుజువయింది. 

 

ఆ సినిమాలో యముడి పాత్రలో ఎన్టీఆర్ పలికిన డైలాగ్స్ ఎప్పటికీ ఆయన ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా మరిచిపోలేరనే చెప్పాలి. ఇక తన తాతయ్య ఎన్టీఆర్ మాదిరిగా ఎప్పటికైనా ఒక మంచి పౌరాణిక సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉన్న ఎన్టీఆర్ తో, రాబోయే రోజుల్లో రాజమౌళి కర్ణ అనే సినిమా కూడా తీయనున్నట్లు ఎప్పటినుండో టాలీవుడ్ లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎప్పుడు సాధ్యపడుతుందో చెప్పడం కష్టం అయినప్పటికీ, తప్పకుండా వారిద్దరి కాంబోలో కర్ణ సినిమా తెరకెక్కడం మాత్రం ఖాయం అని సమాచారం....!!

మరింత సమాచారం తెలుసుకోండి: