టాలీవుడ్ లో దాదాపు పదేళ్ళ తర్వాత అడుగుపెట్టింది సీనియర్ నటి విజయశాంతి. 13 ఏళ్ళ తర్వాత ఆమెను అభిమానులు స్క్రీన్ మీద చూసారు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఈమె ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. దీనితో మళ్ళీ ఆమె బిజీ అవుతుంది అని వరుసగా సినిమాలు చేస్తుంది అని అందరూ భావించారు. కాని అనూహ్యంగా రాములమ్మ సినిమాలకు దూరమవుతున్నట్టు పరోక్షంగా చెప్పారు. చెప్పారో చెప్పలేదో గాని ఆమె చేసిన ట్వీట్ చూసి అందరూ అలాగే అనుకున్నారు మరి. 

 

వరుస ఆఫర్ల తో కీలక పాత్రలు చేస్తుంది అనుకున్న తరుణంలో ఆ ట్వీట్ తో ఆమె అందరికి షాక్ ఇచ్చేసారు.  అయితే అలా ట్వీట్ చేయడానికి ప్రధాన కారణం ఆమెకు అవకాశాలు రాకపోవడమే అని అందరూ అనుకున్నారు. అయితే అవకాశాలు వచ్చినా సరే ఆమె పారితోషకం ఎక్కువగా ఉందని, కాబట్టి వద్దని నిర్మాతలు భావించారట. రెండు మూడు ఆఫర్లు వచ్చినా సరే రాములమ్మ చెప్పిన రేటు కి నిర్మాతలతో పాటుగా దర్శకులు కూడా షేక్ అయ్యారు. దీనితో ఆమె స్థానాన్ని మరొకరితో భర్తీ చేసే ఆలోచన చేసారు. 

 

ఇప్పుడు ఆమెకు మరో ఆఫర్  వచ్చినట్టు సమాచారం. వస్తున్న లక్ష్మీ దేవిని ఒక అడుగు వెనక్కు వేసి అయినా తెచ్చుకోవాలని భావించిన రాములమ్మ ఒక ఆఫర్ కి ఓకే చెప్పినట్టు సమాచారం. చిరంజీవి తర్వాతి సినిమాలు చిరు భార్యగా నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఒక స్టార్ దర్శకుడి తో సినిమా చెయ్యాలని చూస్తున్నారు. దీనితో ఆ సినిమాలో ఒక కీలక పాత్ర ఉంటుందని, ఆ పాత్రకు ఆమె అయితే సరిగా సరిపోతుందని చిరంజీవి భావించి ఆమెను ఓకే చేసినట్టు సమాచారం. ఈ సినిమా జూన్ లేదా ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: