టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో యమా బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరం జూన్ లేదా జూలై లో విడుదల చేయాలని అనుకుని అనూహ్యంగా గా వచ్చే సంవత్సరం సంక్రాంతికి వాయిదా వేశారు జక్కన్న టీం. అనుకున్న సమయానికి షూటింగ్ పార్ట్ పూర్తికాకపోవడం తో పాటు సీజి వర్క్స్ అండ్ వీ.ఎఫ్.ఎక్స్ వర్క్స్ కి చాలా సమయం పడుతుండటంతో జక్కన్న ఇలా ప్లాన్ మార్చారని తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే రాజమౌళి గురించి ఒక వార్త ఫిలింనగర్లో హల్ చల్ చేస్తూ వైరల్ గా మారుతోంది.

 

ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి మరో మల్టీస్టారర్ చేయబోతున్నాడట. ఆ మల్టీస్టారర్ లో ప్రభాస్ తో పాటు మహేష్ కూడా నటిస్తున్నాడని పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి.  అయితే ఈ వార్తల్లో అసలు వాస్తవాలే లేవని తెలుస్తోంది. కాస్త క్లియర్ గా ఆలోచిస్తే రాజమౌళి ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించరు. ఈ విషయం ఆయన చాలా సందర్భాల్లో వెల్లడించారు కూడా. తను మొదలు పెట్టిన సినిమా కంప్లీట్ చేసి ఆ సినిమా విడుదల అయ్యాకనే మరో సినిమా కథ గురించి ఆలోచిస్తారు.

 

ఇలా రాజమౌళి ముందు నుంచి ఫాలో అవుతున్నదే. అందుకే రాజమౌళి ఒక్కో సినిమా చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. అంతేకాదు రాజమౌళి పక్కాగా కథ పూర్తి చేసుకున్నాకే ఆ కథలో ఏ హీరో అయితే బాగుంటుందా అని ఆలోచిస్తారు. అంతే తప్ప ముందే హీరోలని అనుకుని వాళ్ళకోసం కథలు తయారుచేసుకునే అలవాటు ఎప్పుడూ లేదు. కాబట్టి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తున్న పుకారు పూర్తిగా పుకారేనని, అందులో అసలు నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ టెన్షన్ లోనే ఉండటం తో తన యూనిట్ సభ్యులు ఎవరైనా ఈ రూమర్స్ ఆయన వరకూ తీసుకు వెళితే ఆ వార్తలో నిజం లేదు చంపకండి.. అంటున్నారని సమాచారం.
  

మరింత సమాచారం తెలుసుకోండి: