పూజా హెగ్డే, ప్రస్తుతం ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్లోని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ముందుగా నాగచైతన్య సరసన ఒక లైలా కోసం ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే, ఆ సినిమాతో ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ముకుంద అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా కూడా పరాజయం పాలై పూజ ఆశలు నిరాశలు చేసింది. అనంతరం హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి ఆమె నటించిన మొహంజదారో సినిమా కూడా ఫ్లాప్ కావడంతో పూజ పరిస్థితి మరింత ఇబ్బందుల్లో పడింది. 

 

అనంతరం బన్నీతో ఆమె నటించిన డిజె సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ ఛాన్స్ పూజని వరించింది. అనూహ్యంగా ఆ సినిమా విజయం అందుకోవడం, దాని తరువాత సూపర్ స్టార్ మహేష్ తో కలిసి ఆమె నటించిన మహర్షి సక్సెస్ కావడం, అలానే ఆపై వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గద్దలకొండ గణేష్ కూడా హిట్ కావడం జరిగింది. ఇక మొన్న సంక్రాంతి కానుకగా బన్నీ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ అలవైకుంఠపురములో కూడా పూజ హీరోయిన్ గా నటించడం, ఆ విధంగా ఆమెకు వరుసగా నాలుగు విజయాలు దక్కాయి. 

 

ప్రస్తుతం ప్రభాస్ తో ఒక సినిమా, అఖిల్ తో ఓ సినిమా చేస్తున్న పూజా, తెలుగు రాష్ట్రాల్లోనే కాక అటు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించింది. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఆమె అభిమానులు కొందరు అతి త్వరలో ఆమె మీద ప్రేమతో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని, అలానే ఆ కార్యక్రమాన్ని ఎంత గ్రాండ్ గా నిర్వహించనున్నారని అంటున్నారు. కొద్దిరోజులుగా పలు సోషల్ మీడియా మీడియా మాధ్యమాల్లో ఈ వార్త ఎంతో విస్తృతంగా ప్రచారం అవుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఎంత వరకు నాకు తెలియదు కానీ, ఒకవేళ ఇదే గనుక నిజమైతే పూజా క్రేజ్ తో పాటు పేరు కూడా మరింతగా పెరగడం ఖాయం అని చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: