టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న పేరు కన్నడ బ్యూటి రష్మిక మందన్నదే. కుర్ర హీరో నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది. మొదటి సినిమాతో ఆకట్టుంది. హీరోయిన్ గా మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇండస్ట్రీకి సెంటి పరంగా కూడా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా తర్వాత నటించిన సినిమా గీత గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం తెరకెక్కించిన ఈ సినిమాలో టాలీవుడ్ రౌడీ హీరోకి జంటగా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడమేకాదు 100 కోట్ల క్లబ్ లోను చేరింది. దాంతో ఈ సక్సస్ లో రష్మిక కి షేర్ దక్కింది. 

 

దాంతో ఇక రష్మిక మామూలుగా క్రేజ్ ని దక్కించుకోలేదు. ఎంతలా అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ దక్కించుకునేంతగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ కి జంటగా నటించి ఇండస్త్రీలో అందరికి షాకిచ్చింది. అంతేకాదు ఇంత త్వరగా మహేష్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేకపోవడం విశేషం. ఇక సరిలేరు సినిమాలో బాగా నటించిందని ప్రశంసలు అందుకుంది. ఇక ఈ అమ్మడి తెలివితేటలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాకవ్వాల్సిందే.

 

సరిలేరు ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కోసం ముఖ్య అథిదిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ లో రష్మిక చేసిన హడావుడి, హంగామా అంతా ఇంతా కాదు. నానా రచ్చ చేసిందని అందరూ కామెంట్స్ చేశారు. అయితే ఆ రోజు రష్మిక అంతగా అతి చేయడానికి గట్టి కారణం ఉందని బయట పడింది. అదేమిటంటే రష్మిక వీలైనంత త్వరలో చిరంజీవి గారికి జంటగా నటించాలని నటించాలని ఉందట. అందుకే సరిలేరులో ఆయన అటెన్షన్ మొత్తం తన మీదే ఉండేలా టరి చేసిందట. మెగాస్టార్ తో స్టెప్పులేయాలని అత్యుత్సాహపడుతుందట. అంతేకాదు ఆయన ఛాన్స్ కూడా ఇస్తారని కూడా తన సన్నిహితుల దగ్గర ధీమాగా చెబుతుందట. వామ్మో రష్మిక సామాన్యురాలు కాదు కదా...! మీకర్థమవుతుందా.  ఇలాంటి వాళ్ళకి గుడి కట్టేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: