టాలీవుడ్ లో ఈ మద్య కన్నడ బ్యూటీల హవా బాగానే పెరిగిపోతుంది.  ఛలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రష్మిక మందన వరుస విజయాలతో.. స్టార్ హీరోల సరసన నటిస్తూ దుమ్మురేపుతుంది.  ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న ‘భీష్మ’ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది.  ఇప్పటికే ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.  తాజాగా సుధీర్ బాబు `నన్ను దోచుకుందువటే` సినిమా హీరోయిన్ గా పరిచయం అయిన నభా నటేష్సినిమా పెద్దగా హిట్ కాకున్నా మ్యూజికల్ మంచి స్పందన వచ్చింది.  ఆ సినిమా తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఈ మూవీతో నభా నటేష్ కి వరుసగా తెలుగు లో ఛాన్సులు వస్తున్నాయి. అయితే ఇటీవలే `డిస్కోరాజా` రిజల్ట్ తేడా కొట్టినా నభాకు మాత్రం పేరొచ్చింది.  ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయితేజ్ సరసన `సోలో బ్రతుకే సో బెటర్` లో నటిస్తోంది. 

 

ఈ మద్య వరుసగా సక్సెస్ సాధిస్తున్న హీరో, హీరోయిన్లు తమ పారితోషికం కూడా వెంటనే పెంచేస్తున్నారు.  ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత అమ్మడు పారితోషికం పెంచేసేందని .. వెంట వెంటనే రెండు ప్రాజెక్ట్ ల్లో నిర్మాతల ముక్కు పిండుతోందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా పారితోషికంపై వచ్చిన కథనాలపై నభా స్పందించింది. నేను ఇప్పుడిప్పుడే ఈ రంగంలో నిలదొక్కుకుంటున్నాను. నిర్మాతల విషయంలో నాకు పూర్తి క్లారిటీ ఉంది.. వారు నా పాత్రకు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ ఇస్తారు.  అలా అని నేను కూడా ఎవరినీ డిమాండ్ చేయను.

 

మంచి సినిమాలకు ప్రేక్షకాదరణ ఉంటుంది.. అప్పుడు మన రేంజ్ కూడా పెరిగిపోతుంది.  అప్పుడు నాకు ఎంతివ్వాలో నిర్మాతలకు తెలుసు. ఇంకా డిమాండ్ చేసే స్థాయికి చేరుకోలేదు. అయినా నేను ఒకరిని ఇబ్బంది పెట్టే టైపు కాదు. అలాంటి మనస్తత్వం నాకు లేనే లేదు అంటుంది ఈ సొగసరి.  మొత్తానికి నభా మాటల్లో ఓ విషయం క్లియర్ గా అర్ధమవుతోంది. తన ఇమేజ్ కు తగ్గ పారితోషికం ఇస్తే బ్యానర్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తానని తెలివి గానే చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: