టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మరొక స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో భారీ లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం గా, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారు అనే దానిపై కొద్దిరోజులుగా పలు వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ముందుగా అప్పట్లో వివి వినాయక్, కొరటాల శివ, త్రివిక్రమ్, అట్లీ, పూరి జగన్నాథ్ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినపడగా, అయితే కొన్నాళ్ల క్రితం మాత్రం, ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్నారని, ఆ సినిమాకు 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ కూడా నిర్ణయించారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక నేడు ఆ వార్త నిజమే అని అర్ధం అయింది. కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ తదుపరి సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నట్లు ఒక అధికారిక ప్రకటన వెలువడడం జరిగింది. 

 

హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. అయితే ముందుగా ప్రచారం అయినట్లు సినిమా టైటిల్ అదేనా, కథ కథనాలు ఎలా ఉంటాయి అనేటువంటి మిగతా వివరాలు అతి త్వరలో వెల్లడికానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్లు దీనికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లో నిర్మాతలు తెలిపారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసినదే. మరి ఈ సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో వేచిచూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: