టాలీవుడ్ లో హీరోయిన్ ల కొరత ఉండటం తో ఇప్పుడు రష్మిక మంధనా,  పూజా హెగ్డే నే దర్శకులకు అన్ని విధాలుగా దిక్కు అయ్యారు. వారితో మినహా మరో హీరోయిన్ తో సినిమా చేయడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. టాప్ హీరో అయినా ఒక మాదిరి హీరోయిన్ అయినా సరే వాళ్ళు ఇద్దరు మినహా ఎవరూ కనపడటం లేదు. దీనితో ఈ పాపలు కాస్త రేట్ కూడా పెంచేసి షాక్ ఇస్తున్నారు నిర్మాతలకు. ప్రస్తుతం ఇద్దరి చేతిలోనూ సినిమాలు ఉన్నాయి. స్టార్ హీరోలు అయితే చాలు వీళ్ళను దాటి వెళ్ళడం లేదు. 

 

ప్రస్తుతం అల వైకుంఠపురం హిట్ తో పూజా  ఉంటే, సరిలేరు నీకెవ్వరు హిట్ తో రష్మిక ఉంది. రష్మిక నటించిన మరో సినిమా భీష్మ ఇప్పుడు లైన్ లో ఉంది. ఈ సినిమా కూడా హిట్ అయితే మాత్రం పాప డిమాండ్ పెరిగిపోతుంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో ఎక్కువగా హడావుడి చేస్తుంది. త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఈ సినిమా ను వచ్చే ఏడాది విడుదల చేస్తారు. ఇప్పుడు ఈ సినిమా లో హీరోయిన్ గా పూజా  నే మాట్లాడినట్టు సమాచారం. 

 

పూజా హెగ్డే  త్రివిక్రమ్ కి రెండు హిట్స్ ఇచ్చేసింది. ఒకటి ఎన్టీఆర్ తో ఇవ్వగా మరొకటి అల్లు అర్జున్ తో ఇచ్చేసింది. దీనితో  పూజా అయితేనే బాగుంటుంది అని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే పూజా  కి ఈ విషయం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఎన్టీఆర్ తో గనుక పూజా  సినిమా ఓకే అయితే మాత్రం పాప రేంజ్ ఇక రెండు మూడు కోట్ల కు వెళ్ళినా ఆశ్చర్యం లేదు అంటున్నారు టాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: