సినిమా వాళ్ళు ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నా మీడియా మాత్రం వాళ్ళను వదిలి పెట్టే అవకాశం ఉండదు. ఎవరి జీవితాల గురించో ఎక్కువగా ఆసక్తి చూపించే మీడియా రాతలు, మీడియా ప్రచారాలు, మీడియా కెమెరాలు ఇప్పుడు రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్ ని ఇదే విధంగా టార్గెట్ చేసాయి. వాళ్ళు ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడో విడిపోయారు. అక్కడితో అంతా అయిపోయింది. కాని ఒక పక్క రాజకీయ నాయకులు అవమానంగా మాట్లాడటం, మరో పక్క సిని జనాలు వాళ్ళ జీవితాల మీద ఫోకస్ చేయడం. 

 

అసలు రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ విడిపోయి చాలా రోజులు అయింది. కాని వాళ్ళు కలిసారని, పిల్లల కోసం మళ్ళీ పవన్ కళ్యాణ్ తో రేణుదేశాయ్ కలవడానికి ఆసక్తి చూపిస్తుందని, పవన్ కళ్యాణ్ కూడా ఆమె మీద జాలి చూపించి హైదరాబాద్ లోనే ఉండమని చెప్పాడని, ఆమె పిల్లలతో కలిసి పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరణం తో వచ్చే వడ్డీ డబ్బులతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఫ్లాట్ లో బ్రతుకుంది అని మీడియా ఎన్నో కథనాలను వారి మీద ప్రసారం చేసింది. కాని రేణుదేశాయ్ మాత్రం అవి అన్ని నిజం కాదని కొట్టిపారేసింది. 

 

తన తండ్రి నుంచి గాని తన మాజీ భర్త నుంచి గాని పావలా కూడా తీసుకోలేదని, తాను ఉంటున్న ఇల్లు కూడా ఎవరూ కొనివ్వలేదని స్పష్టం చేసింది ఆమె. అయినా గాని ఆమె మీద ప్రచారం మాత్రం ఆగడం లేదు. అసలు ఈ సందడి ఎవరి కోసం చేస్తున్నారో గాని పవన్ కళ్యాణ్ ని రేణుదేశాయ్ ని టార్గెట్ చేసి పదే పదే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు కనీసం ఇబ్బంది పడతారు అనేది కూడా లేకుండా మాట్లాడటం చికాకుగా ఉంది. అయితే దీని వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి అనేది కొందరి మాట. వాళ్ళను కావాలనే టార్గెట్ చేస్తున్నారని పవన్ అభిమానులు అంటున్నారు. మీడియా లో ఒక వర్గం చేసే ప్రచారమే గాని అసలు అంత ఏమీ లేదని, వాళ్ళు కనీసం ఫోన్లు కూడా చేసుకోవడం లేదని ఇరువురి సన్నిహితులు అంటున్నారు. మరి ఈ ప్రచారాలు ఎప్పుడు ఆగుతాయో వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: