ఎవరు ఎన్ని చెప్పినా సరే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఫ్లాప్ అంటున్నాయి కొన్ని వార్తా సంస్థలు దానికి కారణం కూడా చెప్తున్నాయి. సినిమాకు ఇప్పటికీ మహేష్ బాబు ప్రచారం చెయ్యాల్సిన అవసరం ఏంటీ అని ప్రశ్నిస్తున్నాయి. సినిమా వసూళ్లు అన్ని పక్కా ఫేక్ అని కొందరు అంటున్నారు. అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు మహేష్ బాబు మాత్రం ఒక దర్శకుడి తో సినిమా చెయ్యాలని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాడు. టాలీవుడ్ లో మహేష్ కి ఉన్న క్రేజ్ కి దర్శకుడి ని వెతుక్కోవడం ఏంటీ అంటారా...? 

 

దీని వెనుక చాలా బలమైన కారణం ఉంది. మహేష్ బాబు ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా ఫ్లాప్ తో డీలా పడిపోయారని అంటున్నారు టాలీవుడ్ జనాలు. దీనితోనే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చెయ్యాలని చూస్తున్నాడు. త్రివిక్రమ్ కి మహేష్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో ఈ ఇద్దరు జల్సా, ఖలేజా సినిమాల్లో కలిసారు. జల్సా సినిమాలో మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఖలేజా సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేసాడు మహేష్ బాబు. 

 

ఇప్పుడు తాను ఫ్లాప్ తో ఇబ్బంది పడుతున్నాను కాబట్టి, త్రివిక్రమ్ తో మహేష్ రాయబారం నడిపినట్టు సమాచారం. తనతో సినిమా చెయ్యాలని కోరారట మహేష్ బాబు. కాని త్రివిక్రమ్ అప్పటికే ఎన్టీఆర్ తో కమిట్ అయిపోవడంతో చేసేది ఏమీ లేక ఆ సినిమానే ఓకే చేసినట్టు సమాచారం. ఆ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అల వైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్ మంచి జోష్ లో ఉన్నాడు. కాబట్టి తర్వాతి సినిమా తనతో చేస్తే మంచి క్రేజ్ వస్తుంది అనేది మహేష్ భావన. కాని అది నెరవేరలేదు. మరి వంశీ పైడపల్లి తో చేస్తాడో లేక ఇంకెవరి తో అయినా చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: