మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కాని అజ్ఞాతవాసి మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్ళారు. జనసేన పార్టీ పెట్టి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాడు. ఇక త్రివిక్రం మాత్రం నితిన్ తో ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ ల తో సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు.

 

సంక్రాంతి బరిలో దిగిన అల వైకుంఠపురములో అద్భుతమైన సక్సస్ ని సాధించింది. మంచి కమర్షియల్ సక్సస్ ని సాధించింది. అసలు అల సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని గురుజీ, బన్నీ కూడా అనుకోలేదు. ఇక ఈ సినిమాకంటే ముందు ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత వీర రాఘవ అన్న ఫ్యాక్షన్ స్టోరీతో సినిమాని తీసి హిట్ ని దక్కించుకున్నారు. ఈ సినిమా వాస్తవంగా త్రివిక్రం పవన్ కళ్యాణ్ తో తీయాలనుకున్నారు. కాని కథ విన్న పవన్ కళ్యాణ్ ఈ కథకి తారక్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని సలహా ఇవ్వడంతో తారక్ తో తీశాడు. ఇక ఈ సినిమాలో తారక్ కి తండ్రి గా మెగా బ్రదర్ నాగబాబు నటించారు. 

 

ఈ కాంబినేషన్ వినగానే అటు నందమూరి ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ తెగ సంబర పడ్డారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ఎంతో పవర్ ఫుల్ గా ఉండి ఇద్దరి ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దాంతో ఇప్పుడు కొత్త న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో వైరల్ గా మారుతోంది. తాజాగా త్రివిక్రం శ్రీనివాస్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో కొత్త సినిమాని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోందని సమాచారం.

 

అయితే మరో సర్ప్రైజింగ్ న్యూస్ ఏమిటంటే ఈ తాజా సినిమాలో తారక్ కి తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారని. ఇది విన్నప్పటి నుంచి ఇరు వర్గాల ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి. త్రివిక్రం సార్ ఏం కాబినేషన్ సెట్ చేశారు... ఎన్.టి.ఆర్ కి తండ్రిగా మెగాస్టార్ .. ఇది కదా మాకు కావాల్సింది ..! అంటూ ఆనందం లో మునిగి తేలుతున్నారట. మరి ఇది నిజమా కాదా అన్నది అఫీషియల్ గా అనౌన్స్ వస్తే గాని నమ్మలేము.  
   

 

మరింత సమాచారం తెలుసుకోండి: