బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్...ఈ అమ్మడు  సినిమాల్లో  ఎంత హాట్ టాపిక్ గా మారుతోందో... వివాదాలతో కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతోంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానూతునే ఉంటుంది ఈ అమ్మడు.నటన  పరంగా ఈ అమ్మడు ఎన్నో ప్రశంసలు అందుకుని దూసుకుపోతుంది. ఎలాంటి పాత్రలోనైనా తనదైన నటనతో రక్తి కట్టిస్తుంది కంగనా రనౌత్. గ్లామర్ పాత్రలోనైనా విలక్షణమైన పాత్రలోనైనా తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడికి సినిమా అవకాశాలు ఎంతగా ఉన్నాయో... వివాదాలు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అందుకే ఎప్పుడు ఏదో ఒక వివాదంతో తెరమీదికి వస్తూనే ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో అయితే... కంగనా రనౌత్ కాస్త సైలెంట్ అయిన కంగనా రనౌత్ సోదరి రంగోలి మాత్రం కంగనా రనౌత్ పై కామెంట్స్ చేసిన వారిపై విరుచుకు పడుతుంది. 

 

 శత్రువులను చీల్చి చెండాడుతుంది. నిరంతరం సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రముఖుల పై నిప్పులు  చెరుగుతూ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది రంగోలి. తాజాగా మరోసారి తనదైన స్టైల్ లో  విరుచుకుపడింది. బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది కంగనా సోదరి రంగోలి. వీరిద్దరు ప్రధాని నరేంద్ర మోదీని పాసిస్ట్ అని  వ్యాఖ్యానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రంగోలి విరుచుకుపడింది. ప్రధాని మోదీ కాదు మీరు ఫాసిస్టులు నా సోదరిపై చెప్పుతో దాడి చేశారు అంటూ పాత విషయాలే తెరమీదికి తెచ్చింది. 

 

 

 హృతిక్ రోషన్తో ఉన్న గొడవ విషయంలో పరిష్కరిస్తామని పిలిచి జావేద్ అక్తర్ తన సోదరిపై  చెప్పు విసిరారని సీరియస్ అయింది రంగోలి. తన సోదరి తోనే క్షమాపణలు చెప్పించాలని ప్రయత్నించారని.. ఈ క్రమంలో జావిద్ అక్తర్ ప్రవర్తన దారుణంగా ఉంది అంటూ విమర్శించింది. అలాగే ఓ రోజు నా సోదరి కంగనా సూసైడ్ బాంబర్ పాత్రను పోషించడం ఇష్టం లేదని తిరస్కరించడంతో దర్శకుడు మహేష్ భట్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఒకానొక సమయంలో నా సోదరి కంగనా వైపు చెప్పులు కూడా  దర్శకుడు మహేష్ భట్ విసిరారు అంటూ రంగోలి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: