సినిమాలు ప్రేక్షకులను ప్రభావితం చేస్తాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో సినిమాల కంటే సీరియల్ ఎక్కువగా జనాలను ప్రభావితం చేస్తున్నాయి. రెండున్నర గంటల పాటు ఎంటర్టైన్మెంట్ పంచే సినిమా కంటే సంవత్సరాలపాటు సాగతీతగా వచ్చే సీరియల్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే సీరియల్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్న విషయం తెలిసిందే. కేవలం ఇప్పటి నుంచే కాదు ఎన్నో ఏళ్ల నుంచి... మహిళలకు సీరియల్స్ పిచ్చి ఎక్కువ. అందుకే పలు సినిమాల్లో మహిళలు సీరియల్స్ చూసే విషయంపై కామెడీ కూడా పేలుస్తూ ఉంటారు. ఈమధ్యకాలంలో ఎక్కువ సీరియళ్లను చూసి బాగా ప్రభావితం అవుతున్నారు జనాలు.

 


 ఇక ఈ మధ్య కాలంలో అయితే సీరియల్ చూసే ఇన్స్పైర్ అయ్యి ఏకంగా నేరానికి కూడా పాల్పడుతున్నారు. ఇంట్లో సీరియల్ వస్తుంది అంటే భూకంపం వచ్చిన టీవీ ముందు నుంచి కదలరు మహిళలు. ఇక ఆ సమయంలో ఎవరైనా రిమోట్ తీసుకున్నారు అంటే ఇక వాళ్ల పరిస్థితి అధోగతి. పెద్ద ప్రళయం వచ్చిన టీవీ సీరియల్స్ చూడడం మాత్రం మానరు. అంతలా నేటి తరం మహిళలు ప్రభావితం చేస్తున్నాయి సీరియల్. అయితే సీరియళ్ల పై ఉండే ఈ ఆసక్తి కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. 

 

 ఈ క్రమంలోనే తాజాగా టీవీ సీరియల్ కారణంగా ఓ ఘటన జరిగింది. టీవీ సీరియల్ ఆడవాళ్ళ పై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి అనడానికి ఈ ఘటన నిదర్శనంగా మారింది. తమిళనాడులోని తిరువాయూరుకు  చెందిన మహాలక్ష్మి.... భర్తతో  విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నారు. ఇక మంగళవారం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి సీరియల్ చూడడం మొదలుపెట్టింది మహాలక్ష్మి. ఇక దీపం పక్కకు ఒరిగి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. అయినప్పటికీ సీరియల్ చూస్తూ సీరియల్ లో నిమగ్నం అయి  మునిగిపోయింది. ఇక అప్పటికి చేయి  దాటిపోయిన తర్వాత సీరియల్ మోజు  నుంచి తేరుకున్న ఆ మహిళ.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తు సజీవదహనం అయిపోయింది . ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: