టాలీవుడ్ కుర్ర హీరో నాగ శౌర్య నటించిన చలో సినిమా కి వెంకీ కుడుముల దర్శకత్వం చేయడం జరిగింది. అంతేకాకుండా వెంకీ కుడుముల ఫస్ట్ సినిమా కూడా అదే. సినిమా అదిరిపోయే విజయాన్ని సాధించింది. దీంతో ఆ సక్సెస్ తర్వాత నాగశౌర్య వరుస విజయాలతో ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఇదే తరుణంలో డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా భీష్మ అనే సినిమా నీ వెంకీ కుడుముల తెరకెక్కించారు. ఫిబ్రవరి 21వ తారీకు న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది భీష్మ సినిమా యూనిట్. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు టాలీవుడ్ కుర్ర హీరో నాగ శౌర్య గురించి ప్రశ్న ఎదురయింది.

 

మేటర్ లోకి వెళ్తే నాగశౌర్య సొంతగా స్టోరీ రాసుకున్న అశ్వద్ధామ సినిమా ప్రమోషన్ సమయంలో నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుముల పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాగశౌర్య ఏమన్నారంటే వెంకీ కుడుములని తన ఇంట్లో మనిషిలా చూసుకుంటే నమ్మక ద్రోహం చేశాడని, ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని నాగశౌర్య వ్యాఖ్యలు చేశాడు. దీనిపై స్పందించాల్సిందిగా మీడియా వెంకీ కుడుములని ప్రశ్నించింది. కానీ నాగశౌర్య వ్యాఖ్యలపై స్పందించడానికి వెంకీ కుడుముల ఇష్టపడలేదు. 'నాకు సాయం చేసిన వారికి నేను తప్పకుండా క్రెడిట్ ఇస్తాను.

 

ఇప్పటి వరకు అలాగే చేశాను. దీనిపై ఇంతకు మించి మాట్లాడలేను అని వెంకీ కుడుముల తెలిపాడు. మీడియా ప్రతినిధులు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ వెంకీ కుడుముల మాత్రం నోరు విప్పలేదు. అశ్వద్ధామ సినిమా ప్రమోషన్ సమయంలో నాగ శౌర్య ...వెంకీ కుడుముల గురించి ఇంకా మాట్లాడుతూ తన తల్లి వెంకీ కుడుముల అని రెండో కొడుకు లాగా చూసుకోవటం జరిగిందని 'చలో' సినిమా సక్సెస్ అయినా సందర్భంలో కారు కూడా గిఫ్టుగా ఇచ్చినట్లు నాగ శౌర్య చేసిన కామెంట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ విషయంపై వెంకీ కుడుముల నీ ప్రశ్నించిన గానీ పెద్దగా స్పందించలేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: