లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, ప్రఖ్యాత దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా భారతీయుడు 2. కొన్నేళ్ల క్రితం కమల్, శంకర్ ల కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది. మన దేశంలో లంచగొండి తనం మితిమీరిపోవడంతో ఒక వృద్దుడు, దాని ప్రక్షాళనకై ఆఖరుకి, లంచగొండైన తన కొడుకుని సైతం చంపేయడానికి సిద్ధం అయి అతడిని అంతమొందిస్తాడు. మన దేశం యొక్క అభివృద్ధికి అతి పెద్ద ఆటంకం అయిన ఈ లంచగొండితనాన్ని రూపుమాపడానికి అతడు మళ్ళి తిరిగివచ్చి ఏ విధంగా దానిని అంతానికి ప్రయత్నాలు చేసాడు అనే కథాంశంతో ఆకట్టుకునే రీతిలో దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సిద్దార్ధ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ లో నిన్న హఠాత్తుగా ఒక పెద్ద ప్రమాదం చోటుచేసుకుని, ముగ్గురు సినిమా యూనిట్ సభ్యులు చనిపోవడం జరిగింది. అంతేకాక దర్శకడు శంకర్ కు కూడా కొంత ప్రమాదం జరిగింది. అయితే ఒక్కసారిగా జరిగిన ఈ దుర్ఘటన పై కోలీవుడ్ తో పాటు పలుగురు ఇతర భాషల నటులు సైతం ఎంతో విచారం వ్యక్తం చేస్తూ చనిపోయినవారి నివాళులు అర్పిస్తూ, దర్శకడు శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

 

ఇక ఈ దారుణ ఘటనపై టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియపరిచారు. నేడు ఈ షాకింగ్ న్యూస్ విన్నాను. భయంకరం, హృదయవిదారకమైన ఘటన ఇది. చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ అల్లు అర్జున్ తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసారు. ఇక బన్నీతో పాటు మరికొందరు టాలీవుడ్ నటులు సైతం ఈ దారుణంపై సానుభూతిని తెలియచేయడం జరిగింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: