టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో సూపర్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర కలిసి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఇక ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు వరుస విజయాలు అందుకున్న మహేష్, దీనితో ఏకంగా హ్యాట్రిక్ విజయాలు చేజిక్కించుకున్నారు. 

 

ఇక సరిలేరు సక్సెస్ ని ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీ తో కలిసి నెలరోజుల క్రితం విదేశాలకు వెళ్లిన సూపర్ స్టార్, నిన్న తిరిగిరావడం జరిగింది. ఇక నేడు జరిగిన దివంగత నటి, దర్శకురాలైన విజయనిర్మల విగహావిష్కరణ కార్యక్రమంలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తో కలిసి మహేష్ పాల్గొన్నారు. అయితే మహేష్ ఈ వేడుకకు హాజరైన దానిని బట్టి చూస్తుంటే, మరికొద్దిరోజుల్లో ఆయన తన తదుపరి సినిమా పనులు మొదలెడతారని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే పూర్తిగా స్క్రిప్ట్ సిద్ధం చేసిన దర్శకుడు వంశీ, దానికి కొద్దిపాటి తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. 

 

నిజానికి ఈ సినిమాని కొంత లేట్ గా మొదలెట్టి రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, సరిగ్గా అదే సమయానికి రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుండడంతో, తమ సినిమాని వీలైనంత త్వరగా మొదలెట్టి ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట సూపర్ స్టార్. ఈ సినిమాకి మహేష్ ఒక నిర్మాత కాగా, దిల్ రాజు మరొక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, ఇది నిజంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: