యువ హీరో నితిన్.. టాలీవుడ్ బ్యూటీ క్వీన్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ.ఈ సినిమా చలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి భారీ అంచనాలు పెరిగాయి. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా లాగా ప్రేక్షకుల్లో మంచి టాక్ ను సొంతం చేసుకున్నది ఈ సినిమా ట్రైలర్. ఇక సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమాలో రష్మిక నితిన్ జోడి కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపించింది. కాగా నితిన్ రష్మిక మందన కాంబినేషన్ లో వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇది కేవలం నితిన్ కోసమే రాసిన కథని... ఈ సినిమా విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని... షూటింగ్ కూడా చాలా ఈజీగా జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రతి కథలో లవ్ స్టోరీ ఉంటుందని ఇందులో గకామన్ లవ్ స్టోరీ ఉంది కాకపోతే అది వినోదాత్మకంగా సాగుతుంది అంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు. సరదాగా మీమ్స్ చేస్తూ తిరిగే కుర్రాడికి సేంద్రీయ వ్యవసాయానికి సంబంధం ఏమిటి అన్నది భీష్మ సినిమాలో ఆసక్తికరమైన పాయింట్ అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు.
భీష్మ అంటే బ్రహ్మచారి అని ఇందులో అనంత్ నాగ్ బ్రహ్మచారి గా కనిపిస్తాడు అని చెప్పిన దర్శకుడు... అనంత్ నాగ్ కి నితిన్ కి సంబంధం ఏమిటనేది సినిమాలో చూడాలి అంటూ తెలిపాడు.ఈ సినిమా ద్వారా సేంద్రియ వ్యవసాయం మంచిదనే సందేశాన్ని చెప్పబోతున్నాము అని తెలిపాడు. ఇక ఈ సినిమాలో రష్మిక కూడా ఎంతో డెడికేషన్ తో పని చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నానని.. ప్రేక్షకులందరూ సినిమా థియేటర్కు వెళ్లి భీష్మ సినిమా చూడాలని దర్శకుడు వెంకీ కుడుముల కోరాడు.