దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ అయిపోయినటువంటి ప్రభాస్ ఆ తరువాత సాహో అనే ప్యాన్ ఇండియా సినిమా చేసి తానేంటో మరొకసారి నిరూపించుకున్నారు. అయితే ఈ చిత్రం తెలుగులో పెద్దగా ఆడకపోయినప్పటికీ కూడా బాలీవుడ్లో మాత్రం 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సాహో చిత్రంతో బాలీవుడ్ లో అవార్డులు వర్షం కూడా కురిసింది. ఎన్నో అవార్డులను దక్కించుకుంటున్నాడు ప్రభాస్… కాగా తాజాగా ప్రభాస్ కి ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా దక్కించుకున్నాడు. కాగా సాహో సినిమాతో బాలీవుడ్ బిజినెస్ అవార్డ్స్ హైయెస్ట్ గ్రాసింగ్ మెయిల్ డెబ్యూ అవార్డు సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్…
కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ బాగానే కష్టపడ్డప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎక్కువగా ఆదరించలేకపోయారు. కథ కథనాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఎంత పెద్ద భారీ బడ్జెట్తో నిర్మించినప్పటికీ కథ పెద్దగా లేకపోవడంతో పెద్దగా ఇష్టపడలేదు. ఇది ఇంతలా పరాజయాన్ని దక్కించుకున్నప్పటికీ కూడా ప్రభాస్ ఈ సినిమా బాగా సాయపడుతుంది చెప్పాలి. ఇకపోతే ప్రభాస్ తాజాగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా ప్యాన్ ఇండియా చిత్రంగా వస్తున్నటువంటి ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుంది. మరి ఇందులో చాలా కాలం తర్వాత ఓ లవ్స్టోరీతో తెర మీద కనిపించబోతున్నాడు ప్రభాస్ ఈ చిత్రంతో ప్రేక్షకులను ఏ విధంగా ఆకర్షిస్తాడో వేచి చూడాలి.
ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని మూడవ షెడ్యూల్ కి అడుగుపెట్టింది. ఇందులో ప్రభాస్ లుక్ చాలా బావుంటుందని రాధాకృష్ణ ప్రభాస్ని ఓ డిఫరెంట్ వేలో చూపించబోతున్నాడని సమాచారం. మరి చూడాలి ఆయన ఏ మాత్రం చూపిస్తారు అన్నది. అయితే సాహోలో ప్రభాస్ లుక్ మీద కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. అంతగా మంచి లుక్ లేదని ఇందులో ప్రభాస్ని చూసేందుకు ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.