టీమిండియా క్రికెటర్ మిథాలీ రాజ్...మహిళా క్రికెటర్కు ఎంతో  గుర్తింపు తెచ్చి సారథిగా జట్టును ముందుండి నడిపించింది మిథాలీ రాజ్ . ఇక తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది మిథాలీ రాజ్. జుట్టులోని మిగతా క్రీడాకారులను అందరిని ఎంకరేజ్ చేస్తూ జట్టును ఎన్నో ఏళ్ల పాటు ముందుకు నడిపించారు. అందుకే మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం మిథాలీ రాజ్ బయోపిక్ ను  సినిమా గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తాప్సీ పొన్ను మిథాలీ రాజ్ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు శభాష్ మిత్తు  అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది చిత్ర బృందం . ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా తాజాగా విడుదల చేసింది. ఇక ఈ ఫస్ట్ లుక్ ను తాప్సీ తన సోషల్ మీడియా ఖాతాలో  పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ పై స్పందించిన మిథాలీ రాజ్ తామిద్దరం కొంచెం అటు ఇటుగా ఒకేలా ఉంటాము అని  తెలిపింది.

 

 

తాను ఎలా ఉన్నానో తాప్సీ కూడా అలాగే ఉంటుంది అంటూ కామెంట్ పెట్టండి మిథాలీ రాజ్. తాను పెట్టుకున్న హాట్ లాంటిదే తాప్సి  కూడా పెట్టుకుంది అని తెలిపింది . నేను ఆడుతున్న  సమయంలో తన కురులు ముందుకు పడుతుంటాయి... ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో  కూడా అలాగే పడ్డాయి అంటూ తెలిపింది . కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. మిథాలీ రాజ్  జీవితంలోనే కీలక ఘట్టాలను సినిమాలో చూపించనునట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం మిథాలీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. 

 

 

 ఇదిలా ఉంటే ప్రస్తుతం బయోపిక్ లో హవా ఎక్కువ అయిపోతుంది.ఇండస్ట్రీలో ఏదైనా మంచి బయోపిక్ లను  తెరకెక్కించి ఎన్నో సంచలన విజయాలను అందుకుంటున్నారు దర్శకత్వనిర్మాతలు . అయితే కథ కొత్తగా రాసుకోవాల్సిన అవసరం లేకపోవడం అంతేకాకుండా.. ఉన్న కథని కొన్ని మెరుగులు దిద్ధితే  సరిపోతుండడంతో ఇలాంటివి తీయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు దర్శక నిర్మాతలు. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు క్రీడాకారులు బయోపిక్ లను  తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ బయోపిక్ కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: