పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ సినిమాలో నటించిన కృతికర్బందా మీకు గుర్తుందా. ఆ సినిమాలో లంగా ఓణిలో అచ్చం అందమైన అమ్మాయి గా నటించిన కృతికర్బందా ఎంతో ఆకట్టుకుంటుంది. ఆ సినిమా తర్వాత కృతి తెలుగులో ఎనర్జిటిక్ హీరో రామ్ ఒంగోలు గిత్త రాంచరణ్ బ్రూస్ లీ సినిమాల్లో నటించింది. తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన హీరోయిన్గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది. అయితే బాలీవుడ్లో మాత్రం ఆమె మంచి అవకాశాలతో దూసుకుపోతుంది. గత ఏడాది నటించిన హౌస్ ఫుల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎప్పుడు సౌమ్యంగా వుండే కృతి కి పట్టరాని కోపం వచ్చేసింది. ఆమె ఒక్కసారిగా తన సోషల్ మీడియాలో రెచ్చిపోయి వార్నింగ్లు ఇచ్చేసింది.
ఇటీవల తరచుగా సెలబ్రిటీలు విమానయాన సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కృతికర్బందా సైతం బాధితురాలి గా మారారు. విమానంలో తన మిస్ అయిందని తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అక్కడితో ఆగని ఆమె పై తీవ్ర ఆగ్రహంతో విరుచుకుపడుతూ మెసేజ్ పెట్టారు. కృతి తన లగేజ్ పోవడం పై స్పందిస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టారు. ' డియర్ ఎయిర్ ఇండియా.. మరోసారి నా లగేజ్ పోగొట్టినందుకు థాంక్స్. మీ సిబ్బందికి కొంచెం మర్యాద నేర్పించండి ' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనిపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందిస్తూ.. మా క్షమాపణలు అంగీకరించగలరు.. మీ బ్యాగ్ నంబర్, ఇతర వివరాలు తెలియజేస్తే మా టీం తో చర్చించి సమస్యని పరిష్కరిస్తాం అని ఎయిర్ ఇండియా కృతి మెసేజ్కు బదులిచ్చింది. కృతి ఇంత ఘాటుగా స్పందించడంతో ఆమెకు ఏమైంది ? అని కొందరు అంటుంటే విలువైన వస్తువులు పోయిన బాధలు ఆమె ఇలా మెసేజ్ పెట్టడంలో తప్పేం లేదని మరి కొందరు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.