బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో ప్రేమ కథలు కాస్త తక్కువగానే ఉంటాయి అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ హీరోయిన్లు ఎక్కువ కాలం రాణించ లేకపోవడం కూడా దానికి కారణం. గతంలో కూడా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు మినహా పెద్దగా వార్తల్లో ఉండే వాళ్ళు కాదు అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ తరం హీరోయిన్లు మాత్రం కాస్త ఈ విషయంలో దూకుడుగానే ఉన్నారు అనేది అర్ధమవుతూ ఉంటుంది. ఇక్కడ ప్రేమ కథలు నడపకపోయినా తమిళంలో, హిందీ లో ప్రేమ కథలు నడిపారు . 

 

ఇక ఇక్కడి ప్రేమ కథల్లో కొన్ని ప్రత్యేకంగా చెప్పుకునేవి ఉంటాయి. అందులో ప్రధానంగా ఒకప్పుడు వార్తల్లో వచ్చింది, కాజల్, ప్రభాస్ ప్రేమ కథ. అసలు వీళ్ళ గురించి ఎం తెలిసిందో ఏమో తెలియదు గాని మీడియా మాత్రం ఎక్కువగా ఫోకస్ చేసింది కొన్ని కొన్ని విషయాల్లో. వీరు ఇద్దరూ వరుసగా రెండు సినిమాలు చేసారు. మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ సినిమాలు కలిసి చేసారు. దీనితో వీరి మధ్య ప్రేమాయణం నడిచింది అనుకున్నారు చాలా మంది. అసలు వాళ్ళు ఎక్కడా ఒంటరిగా కనపడలేదు కూడా. 

 

కాని వాళ్ళు షూటింగ్ స్పాట్ లో రాసుకుని పూసుకుని తిరిగారు అంటూ వార్తలు రాసారు. వాళ్ళు కూడా ఈ ప్రచారంపై అప్పట్లో పెద్దగా స్పందించలేదు. ప్రేమ వ్యవహారాల్లో కాజల్ పెద్దగా దృష్టి పెట్టలేదు, కేవలం సినిమాలే అంటూ ఉంటారు. అందుకే ఆమె ఈ ప్రచారం విషయంలో పెద్దగా స్పందించలేదు అనేది టాలీవుడ్ జనాల మాట. ఇప్పుడు కెరీర్ లో ఈ ఇద్దరు పీక్ స్టేజి లో ఉన్నారు. వయసు మీద పడుతున్నా సరే కాజల్ మంచి సినిమాలు చేస్తుంది. అలాగే ప్రభాస్ కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: