టాలీవుడ్ లో వరుస విజయాలతో దున్నేస్తున్నాడు నందమూరి కుర్రోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.  టెంపర్ సినిమాతో తర్వాత జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నాడు ఎన్టీఆర్.  ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళితో నాలుగోసారి ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు.  ఈ మూవీ షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

 

 ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.  అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతుండగానే ఎన్టీఆర్ తన 30వ సినిమా  త్రివిక్రమ్ తో ప్రకటించేశారు. మే నెల నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ విషయంలో ఇప్పుడు తర్జనభర్జన జరుగుతుంది.  త్రివిక్రమ్ సినిమాల్లో వరుసగా నటిస్తు మంచి విజయాలు అందుకుంటున్న పూజా హెగ్డే కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉండే స్కోపో ఉందట.  ఈ నేపథ్యంలో మరో హిరోయిన్ గా రష్మిక మందన ని తీసుకోవాలని అనుకుంటున్నారట.  

 

ఇదే సందర్భంలో మరో హీరోయిన్ పేరు వెలుగులోకి వచ్చింది. అక్కినేని నాగ చైతన్యతో వివాహం జరిగిన తర్వతా వరుస విజయాలు అందుకుంటున్న అక్కినేని సమంతను ఎన్టీఆర్ కి జోడీగా తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారట. ఇదే జరిగితే ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో వచ్చే 5వ మూవీ అవుతుంది. మొదటిసారి బృందావనం సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఆ తరువాత రామయ్య వస్తావయ్యా, జనతా గ్యారేజ్, రభస మూవీలో కలిసి నటించారు. ఈ జోడీ ఇప్పటికే పలు విజయాలు కూడా సాధించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: