ఒకప్పుడు హీరోయిన్లు ప్రొడ్యూసర్ ఎలా చెపితే అలా వినేవారు. చాలా ఒబీడియంటెడ్గా పని చేసేవారు. కానీ ప్రస్తుతం హీరోయిన్లకు మాత్రం డిమాండ్ బాగా పెరిగిపోయింది. వాళ్ళు ఏం చెపితే అది వినాలి అన్నట్లు ఉంటున్నారు కొంత మంది హీరోయిన్లు. ఇక హీరోయిన్లు ఒప్పందం ప్రకారం ముందు అనుకున్నట్లు ప్రమోషన్లకి రాకుండా డుమ్మాలుకొట్టడం, అలాగే హోటల్ బిల్లులు కూడా లక్షల్లో కట్టించుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీగా మారింది. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇటీవలె తాజాగా విడుదలమైన నాగశౌర్య, మెహ్రీన్ కలిసి జంటగా నటించిన చిత్రం `అశ్వధామ`. ఈ చిత్రం విడుదలయ్యాక ఈ భామ ఇంటర్వ్యూలకు మాత్రం ముఖం చాటేసింది. అదేమంటే తన తాతయ్యకు హార్ట్ ఎటాక్ అని చెప్పి మీడియా ముందుకు రావడానికి నిరాకరించింది.
దీంతో నాగశౌర్య తండ్రి శంకరప్రసాద్కు చాలా కోపం వచ్చింది. దాంతో ఆయన కాస్త మెహ్రీన్ హోటల్ బిల్స్ని కూడా చెల్లించేది లేదంటూ హెహ్రీన్కు చెప్పేశాడట. దీంతో వివాదం మరింతగా ముదిరిపోయింది. ఇలాంటి పద్దతి మంచిది కాదని, హోటల్ బిల్లులు చెల్లించాలని అడిగిందట. ఎంత అడిగినా శంకరప్రసాద్ చెల్లించకపోవడంతో తానే చెల్లించి హొటల్ రూమ్ని ఖాలీ చేసి వెళ్లిపోయిందట. దీనిపై ఇటీవల వరుస కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీంతో మౌనం వీడిన మెహ్రీన్ తనని నాగశౌర్య, అతని తండ్రి శంకరప్రసాద్ ఇబ్బంది పెట్టారని, ప్రమోషన్స్కి రానంటే హోటల్ బిల్స్ కూడా కట్టలేదని, ఇది మంచి పద్దతి కాదని, దీని కారణంగా ఇండస్ట్రీలో తన రెప్యుటేషన్ దెబ్బతిందని వాపోయింది.
ఇక ఇక్కడితో ఈ టాపిక్ని వదలేద్దామని, దీని కారణంగా తన కెరీర్ దక్షిణాదిలో ఇబ్బందుల్లో పడే ప్రమాదం వుందని మెహ్రీన్ స్పష్టం చేసింది. మరి మెహ్రీన్ స్పందన పై నాగశౌర్య, అతని తండ్రి శంకరప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈసారి ఏమని స్పందిస్తారో చూడాలి. ఈ హీరో అందం అభినయం అన్నీ ఉన్నా ఎందుకోగాని లక్ మాత్రం పెద్దగా కలిసిరావడం లేదు. సినిమాల మీద సినిమాలు తీసుకుంటు పోతున్నాడు కాని పెద్దగా క్లిక్ మాత్రం అవ్వడంలేదు. ఛలో తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేదనే చెప్పాలి.