ఈ మధ్య గత రెండు వారాలుగా టాలీవుడ్ లో వివాదాస్పదంగా మారిన అంశం నాగశౌర్య వెంకీ కుడుముల మధ్య వివాదం. నాగశౌర్య వెంకీ కుడుముల కాంబినేషన్లో చలో సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే చలో సినిమా స్క్రిప్ట్ విషయంలో తన ఇన్వాల్వ్మెంట్ వుంది అంటూ నాగశౌర్య చెప్పుకున్నాడు. తన వద్దకి దరిద్రమైన స్క్రిప్టుతో వెంకీ కుడుముల వస్తే.. తాను గైడెన్స్ ఇచ్చి ఎన్నో మార్పులు చేశాను అంటూ నాగశౌర్య చెప్పడం టాలీవుడ్ లో సంచలనం గా మారిన విషయం తెలిసిందే. అయితే నాగశౌర్య వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక దీనిపై వెంకీ కుడుముల ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోను అన్నట్లుగానే ఉన్నారు. 

 

 

 అయితే తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా  తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి... బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. హీరో నితిన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది భీష్మ సినిమా. ఈ సినిమా విజయం సాధించిన జోష్ లో  చిత్రబృందం  సక్సెస్ మీట్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. 

 

 

 ఈ సందర్భంగా సక్సెస్ మీట్ లో హీరో నితిన్ వేసిన ఒక పంచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెంకీ కుడుముల సక్సెస్ మీట్ లో  స్పీచ్ ఇస్తున్న సమయంలో... చివరిలో మైక్ లాక్కున్న హీరో నితిన్ ఈ స్క్రిప్ట్ నీదేనా అంటూ కామెంట్ చేశాడు. ఇక నితిన్ వేసిన పంచ్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. నితిన్ నాగశౌర్య మీదనే సెటైర్ వేశాడు అంటూ  అటు ప్రేక్షకుల్లో కూడా చర్చ నడుస్తోంది. ఇండైరెక్ట్ గానో లేక  డైరెక్టుగానో  నితిన్ సక్సెస్ మీట్   నాగశౌర్యను  ఉద్దేశించే అలా కామెంట్ చేసి ఉంటాడు అంటూ అనుకుంటున్నారు నెటిజన్లు. ఏదేమైనా ప్రస్తుతం యంగ్ హీరో నాగ శౌర్య పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో నెగిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాడు అని  పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: