టాలీవుడ్ లో ప్రభాస్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది కానీ బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రపంచం నలుమూలల ప్రభాస్ క్రేజ్ పాకిపోయింది. ఇక సాహో లాంటి యాక్షన్ మూవీతో బాలీవుడ్ లో ప్రభాస్ కి ఇమేజ్ బాగా ఏర్పడింది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో మూవీ తెలుగులో అంతా సత్తా చాట లేకపోయినప్పటికీ బాలీవుడ్లో మాత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే 200 కోట్ల వరకు... సాహో సినిమా వసూళ్లు రాబట్టింది. సాహో సినిమా తర్వాత హిందీలోనే ప్రభాస్ సినిమా ఉంటుందని అనుకోగా ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ డియర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని హిందీలో కూడా డబ్ చేయబోతున్నారు.
అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఓ డియర్ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ నెక్స్ట్ మూవీ బాలీవుడ్లోనే చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రభాస్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుండగా... ప్రభాస్ ఎంట్రీ తెలుగు దర్శకుడి తోనే అన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి నీ హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో హిందీలో ఓ సినిమా ప్లాన్ చేసినట్లు సమాచారం.
అయితే ఇప్పటికే ప్రభాస్ కి సాహో సినిమా తో.. సందీప్ రెడ్డి వంగాకు కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే హిందీతో పాటు తెలుగులో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉందని... అందుకే వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కించేందుకు టి సిరీస్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సమ్మర్ చివర్లో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదండోయ్ తెలుగులో హిందీలో వేరువేరుగా సినిమాలో చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. టి సిరీస్ నిర్మాణ సంస్థతో కలిసి యు.వి.క్రియేషన్స్ కూడా ఈ చిత్రాన్ని నిర్మించడానికి భాగస్వామి కాబోతునట్లు సమాచారం.