టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ తో మంచి విజయం అందుకున్న నితిన్ తర్వాత వరుస డిజాస్టర్స్ తో కెరీర్ లో తెగ ఇబ్బంది పడుతూ వచ్చాడు.  హీరోగా తనకు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఛలో ఫేమ్ వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన నటించిన ‘భీష్మ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ మూవీ ఎలాంటి భారీ అంచనాలు లేకుండా కూల్ గా వచ్చి బీభత్సం సృష్టిస్తుంది.  రిలీజ్ అయిన మొదటి రోజే పాజిటీవ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు రాబడుతుంది.  వెంకీ కుడుముల తయారు చేసుకున్న ఫన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో బాగా పేలాయి.

 

కొన్ని సీన్లకు థియేటర్లో ఆడియన్స్ ఎగిరి గంతేశారు.  నాలుగు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. తాజాగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్  సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లోనితిన్, రష్మిక, వెంకీ కుడుములతో పాటు ఇతర చిత్ర యూనిట్ పాల్గొన్నారు.  ఈ సక్సెస్ మీట్ లో హీరో నితిన్ చాలా ఎమోషన్ అయ్యారు.  వెంకీ కుడుములని దగ్గరకు తీసుకుని.. ఈ హిట్టుతో నువ్వు చాలా మందికి సమాధానం చెప్పావ్ అని అంటూ డైరెక్టర్ ని తెగ మెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ ఈ మూవీ ఇద్దరికి ఎంతో ఛాలెంజ్ అన్న విషమం మా ఇద్దరికే తెలుసు.  కొంత కాలంగా వరుసగా నా ఫెయిల్యూర్స్ నన్ను కాస్త ఇబ్బంది పెట్టాయి. ఈ మూవీ మంచి హిట్ అయ్యింది.. నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అని అన్నారు.  

 

మొత్తానికి ఈ క్రెడిట్ మొత్తం వెంకి కుడుములకే దక్కుతుందని అన్నారు.  ఇదిలా ఉంటే.. న్ని వారాల క్రితం యంగ్ హీరో నాగ శౌర్య ఓ ఇంటర్వ్యూలో వెంకీ కుడుములపై పలు ఆరోపణలు చేసిసినట్లు వార్తలు వచ్చాయి.. తాను గిఫ్ట్ గా ఇచ్చిన కారు కూడా అమ్మేశాడని నాగశౌర్య కామెంట్స్ చేశాడు. శౌర్య ఆరోపణలపై వెంకీ స్పందించలేదు.  తాను హిట్ కొట్టిన తర్వాత తానేంటో తెలుస్తుందని అప్పట్లో అన్నట్లు వార్తలు వచ్చాయి. మొత్తానికి భీష్మ హిట్ ఇద్దరూ తెగ సంతోషంలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: