పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసినదే. 2 సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా తో సినిమాలు ఆపేసిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. జనసేన పార్టీ తరపున 2019 ఎన్నికలలో పోటీ చేసి మొట్టమొదటిసారి రెండుచోట్ల ఓడిపోయారు. దీంతో ఆ సమయంలో అప్పుడే పవన్ కళ్యాణ్ ఇంక రాజకీయాలకు ప్యాకప్ చెప్పి సినిమాల్లో మేకప్ వేసుకుంటారు అని అప్పట్లో విమర్శలు చేశారు. ఆ సమయంలో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు సినిమాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదని రాజకీయాల్లోనే కంటిన్యూ అవుతున్నట్లు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఇటీవల పవన్ సినిమా రంగంలోకి రావడంతో జనసేన పార్టీలో ఉన్న మెయిన్ పార్టీ లీడర్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

 

ఇటువంటి సమయంలో పవన్ మాట్లాడుతూ తనకు పార్టీ నడపాలన్న తనను నమ్ముకున్న కుటుంబాలను ముందుకు తీసుకెళ్లాలని తనకు తెలిసింది సినిమా కాబట్టి సినిమాలు చేస్తానని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికే నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ తాజాగా మరొక సినిమా కన్ఫామ్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే తన కెరీర్ లో మర్చిపోలేని విజయాలు అందించిన డైరెక్టర్ పూరితో పవన్ కళ్యాణ్ సినిమా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బద్రి, ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ సినిమా చేయడం జరిగింది. తాజాగా మూడో సినిమా పవన్ పూరి తో చేయటానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు బలంగా వినబడుతున్నాయి. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో రావటంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు. సరైన టైమ్ లో పూరి జగన్నాథ్.. పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడని అప్పుడే కామెంట్లు కూడా స్టార్ట్ చేయడం మొదలెట్టేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: