ఒకప్పుడు స్టార్స్ గా ఉన్న హీరోయిన్స్ ను గుర్తించి వాళ్లని మళ్లీ తెరకు తన పాత్రలతో పరిచయం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్. ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన హీరోయిన్స్ మళ్లీ సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నా సరైన పాత్రలు రావట్లేదని వెనక్కి తగ్గుతున్నారు. అలాంటి టైంలో త్రివిక్రం తన సినిమాలతో వారికి ఛాన్సులు ఇస్తున్నాడు. అత్తారింటికి దారేది సినిమాలో నదియ.. అజ్ఞాతవాసి సినిమాలో ఖుష్బు.. అల వైకుంఠపురములో టబు. 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అత్త పాత్రలో నదియాని సెలెక్ట్ చేశాడు త్రివిక్రం. ఒకప్పుడు తెలుగులో నటించిన ఈ భామని మన వాళ్లు ఎప్పుడో మర్చిపోయారు. అయితే సినిమాలో పొగరుబోతు అత్త పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అని నదియాని ఒప్పించి ఆ పాత్ర చేయించి ఆడియెన్స్ చేత క్లాప్స్ కొట్టించాడు త్రివిక్రం. ఇక ఆ తర్వాత నదియా వరుస సినిమాలు చేతూ వచ్చారు. ఇక కోలీవుడ్ డైరక్టర్ సముద్రని పెళ్లాడిన తర్వాత తెలుగు సినిమాల్లో నటించని ఖుష్బుని కూడా అజ్ఞాతవాసితో మళ్లీ తెలుగు తెర మీదకు తెచ్చాడు త్రివిక్రం.  

 

సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందకపోయినా సినిమాలో ఆమె పాత్ర మెప్పించింది. ఇక రీసెంట్ గా అల వైకుంఠపురములో సినిమాలో టబుని దించాడు త్రివిక్రం. తెలుగు సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న టబు బాలీవుడ్ కు వెళ్లి అక్కడ బాగా సెటిల్ అయ్యింది. తెలుగులో అంతకుముందు అడపాదడపా సినిమాలు చేసే అమ్మడు ఈమధ్య పూర్తిగా తెలుగు సినిమాలు చేయడం మానేసింది. అందుకే అల వైకుంఠపురములో సినిమాలో టబుకి మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించాడు త్రివిక్రం. పాత్రకు తగినట్టుగా టబు నటన అందరిని మెప్పించింది. ఇలా ఒకప్పుడు తెలుగు తెర మీద హీరోయిన్స్ గా క్రేజ్ తెచ్చుకున్న వారిని గుర్తించి మరి అవకాశాలు ఇస్తున్న త్రివిక్రం కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: