నాగ‌చైత‌న్య, స‌మంత‌లు ఎంత క్యూట్ క‌పులో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఈ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన మ‌జిలీ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. మ‌రి మ‌ళ్ళీ ఇదే కాంబినేష‌న్ రిపీట్ అవ్వ‌బోతుంద‌ని స‌మాచారం. అయితే దానికి ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నార‌ట‌. ప‌రుశురాం అన‌గానే అంద‌రికి ముందుగా గుర్తువ‌చ్చేది క్యూట్ ల‌వ్ స్టోరీ గీత‌గోవిందం. ఇక ఈ చిత్రం సీక్వెల్ లాగా గీత‌గోవిందం2 చిత్రం తీయ‌బోతున్న‌ట్లు సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఈ సినిమా గురించి ముందు ప‌ర‌శురాం విజ‌య్‌దేవ‌ర‌కొండని సంప్ర‌దించాల‌ని అనుకున్నార‌ట‌. కానీ ప్ర‌స్తుతం విజ‌య్ మార్కెట్ కాస్త అంతంత మాత్రంగానే ఉండ‌డంతో విజ‌య్ క్రేజ్ మీద అంత‌గా న‌మ్మ‌కం కుద‌ర‌క ప‌ర‌శురాం చై,శ్యామ్‌ల‌ను క‌లిసి క‌థ‌ను చెప్పార‌ట‌.

 

అయితే విజ‌య్ ఇటీవ‌ల తీసిన చిత్రం వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ బాయ్ పెద్ద డిజాస్ట‌ర్ అయింది. అంతే కాక తాను ప్రొడ్యూస్ చేసిన చిత్రం ఎవ్వ‌రికీ చెప్ప‌ను కూడా అంతంత మాత్రాన సినిమా ఆడింద‌నే చెప్పాలి. మ‌రి వ‌రుస ఫ్లాప్‌ల‌తో ఉన్న విజ‌య్‌కి అవ‌కాశం ఇవ్వ‌డం పై ద‌ర్శ‌కులు కాస్త ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఇక చైత‌న్య విష‌యానికి వ‌స్తే ఆల్రెడీ  శైల‌జారెడ్డి అల్లుడు, ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌జిలీతో హిట్ కొట్టాడు. ప్ర‌స్తుతం శేఖ‌ర్‌క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్‌స్టోరీ అనే ఓ రొమాంటిక్ మూవీ చేస్తున్నారు. అందులో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ బిజీలో చైతూ ఉన్నారు. కాబ‌ట్టి ప‌రుశురాం ఈ సినిమాకి చైతు, స‌మంత‌లు అయితే క‌రెక్ట్‌గా సూట్ అవుతార‌ని డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం.

 

మ‌రి ఈ కాంబినేష‌న్ క‌నుక రిపీట్ అయితే సూప‌ర్ అనే చెప్పాలి. అక్కినేని ఫ్యాన్స్ కి ఇది మ‌రొక పండ‌గ లాగా ఉంటుంది. అలాగే స‌మంత ఈ మ‌ధ్య న‌టించే చిత్రాల‌న్నీకూడా  త‌న పాత్ర‌కు మంచి ప్రాధాన్య‌త ఉన్న క‌థ‌ల‌ను ఎన్నుకుంటూ స‌క్సెస్‌ల బాట‌లో ప‌య‌నిస్తుంది. ఇటీవ‌లె విడుద‌లైన జాన్ సినిమా కూడా స‌మంత‌కి మంచి పేరు వ‌చ్చింద‌నే చెప్పాలి. మ‌రి ఎటువంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించే స‌మంత ఇప్పుడు మ‌రోసారి చైతుతో తెర మీద క‌నిపించి క‌నువిందు చేయ‌నుంది. అయితే ఈ విష‌యం పై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: