సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఛాన్సులు లేకపోతే వాళ్ల పరిస్థితి వర్ణతీతం. ఇదే కోవలోకి చెందుతుంది హీరోయిన్ కీర్తిచావ్లా. ఆమె తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, తమిళ చిత్రాలలో కూడా నటించింది. అయితే మొట్టమెదట ఆది సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించింది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమెకు ఇదే ఫస్ట్ సినిమా. 2002లో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. నీ నవ్వుల తెల్లదన్నాన్ని.... పాట గుర్తుంటే హీరోయిన్ కీర్తిచావ్లా కూడా గుర్తుంటుంది. పారిజాత పుష్పంలా ఆ పాటలో కనిపించే కీర్తిచావ్లాకు ఆ తరువాత తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
ఆది తర్వాత ఎన్నో సినిమాల్లో చేసినా.. అమ్మడు ఏ మాత్రం రాణించలేదు. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత తెలుగు తెరకు దూరమైన కీర్తి చావ్లా తమిళ ఇండస్ట్రీకి దగ్గరైంది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది. అక్కడ బాగానే పేరు సంపాదించుకుంది. అయితే క్రమంగా అక్కడ కూడా ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో అప్పట్లో గ్లామర్ పాత్రలకు తాను ఎప్పడు సిద్దమే అన్న ఈ ముద్దుగుమ్మ అవసరమైతే ముద్దు సన్నివేశాలలో కూడా నటించేందుకు అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇక అప్పటికే తాను తీసిన సినిమాలు రిలీజ్కు కూడా నోచుకోలేదు.
దాంతో ఉన్న ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడింది. కానీ ఓ మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని.. చివరకు తోటి వారికింద పని చేయడం ఇష్టంలేక.. ఆ విషయాన్ని తాను ఎవరికీ చెప్పలేక సతమతమైంది. అలాంటి సమయంలో తన ఫ్రెండ్స్ ఈ విషయం తెలుసుకుని తనని మందలించి.. ఆమె చేత ఓ వ్యాపారాన్ని పెట్టించారు. ఇక తన ఫ్రెండ్స్ చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని ఈ 14న ప్రేమికుల రోజు సందర్భంగా తన ప్రేమను వాళ్లిద్దరి ఫ్రెండ్స్పై చూపించినట్టు ఓ పోస్ట్ చేసిందని తెలుస్తోంది. ఏదైతేనేం.. తెలుగు సిసిమా ఇండస్ట్రీ మరియు తమిళ సినిమా ఇండస్ట్రీల్లో అవకాశాలు లేకపోయినా తన మనోధైర్యాన్ని వదులుకోకుండా తన కాళ్లపై తాను నిలబడింది.