టాలీవుడ్ లో హాస్య నటుల్లో అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్. అగ్ర హీరోలతో సమానంగా పారితోషికం తీసుకుంటూ కెరీర్ తొలి రోజుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గోదావరి జిల్లా యాస కూడా సునీల్ కి బాగానే కలిసి వచ్చింది అని చెప్పుకోవచ్చు. అయితే అనూహ్యంగా సునీల్ హీరోగా మారిపోయాడు. ఊహించని విధంగా అతను హీరో అవతారం ఎత్తడం తో టాలీవుడ్ జనాలు కూడా ఒకానొక సందర్భంలో ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని సినీ పెద్దలు కూడా చర్చించారు. 

 

అయితే హీరోగా సునీల్ పెద్దగా హిట్ అవ్వలేదు. ఒకటి రెండు సినిమాలు మినహా అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. దీనితో ఇప్పుడు సునీల్ మళ్ళీ కమెడియన్ గా మారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటీ అనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు అతని కెరీర్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ పెద్ద దిక్కు అయ్యాడని అంటున్నారు. త్రివిక్రమ్ కి సునీల్ కి మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం తోనే సునీల్ ని అరవింద సమేత సినిమా కోసం తీసుకున్నారు త్రివిక్రమ్. 

 

ఇప్పుడు కూడా మరో సినిమాకు సునీల్ ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. భవిష్యత్తులో తాను చేసే ప్రతీ సినిమాలో సునీల్ కి పాత్ర ఉంచే విధంగా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం సునీల్ ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక అతను హీరోగా నటించడం అనవసరం అనే అభిప్రాయమే ఎక్కువగా వినపడుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో ఆయనకు మంచి విజయం దక్కిన సంగతి తెలిసిందే. వసూళ్లు కూడా ఆ సినిమాకు భారీగానే వచ్చాయి. ఎన్టీఆర్ తో చేసే సినిమాలో సునీల్ కి పాత్రను సిద్దం చేసాడు త్రివిక్రమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: